Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘోర ఘటన వెలుగుచూసింది. కేవలం మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తల్లి మందలించిందనే చిన్న కారణంతో.. 17 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ప్రతిరోజూ ఫోన్ను ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. దీనిపై గమనించిన తల్లి, ఫోన్ అంతగా చూడొద్దని.. చదువుపై దృష్టి పెట్టాలని కాస్త గట్టిగా మందలించింది.
తల్లి మాటలకు తీవ్రంగా అలిగిన సుశాంత్, క్షణికావేశంలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని మొబైల్ నంబర్కు ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలింపు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో, చివరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- 19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
- APJAC: డీఏలు ఎందుకు ప్రకటించడం లేదు.? ప్రభుత్వ శ్వేతపత్రంపై ఏపీజేఏసీ ఫైర్.!
ఈ క్రమంలోనే స్థానిక గుంతూరు చెరువులో ఒక మృతదేహం తేలియాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా.. అది కనిపించకుండా పోయిన సుశాంత్దేనని అధికారులు నిర్ధారించారు. తల్లి మందలించిందనే మనోవేదనతోనే బాలుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాక గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈనాటి డిజిటల్ యుగంలో చిన్న విషయాలకే యువత తీవ్ర మనస్తాపానికి గురై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, యువతకు సంబంధించిన మానసిక ఆరోగ్యం, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
-
Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
PM Modi: భవిష్యత్ భారత్ నిర్మాతలు మీరే.. యువతకు ప్రధాని మోడీ స్ఫూర్తిదాయక సందేశం..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!