Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘోర ఘటన వెలుగుచూసింది. కేవలం మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తల్లి మందలించిందనే చిన్న కారణంతో.. 17 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ప్రతిరోజూ ఫోన్ను ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. దీనిపై గమనించిన తల్లి, ఫోన్ అంతగా చూడొద్దని.. చదువుపై దృష్టి పెట్టాలని కాస్త గట్టిగా మందలించింది.
తల్లి మాటలకు తీవ్రంగా అలిగిన సుశాంత్, క్షణికావేశంలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని మొబైల్ నంబర్కు ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలింపు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో, చివరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
ఈ క్రమంలోనే స్థానిక గుంతూరు చెరువులో ఒక మృతదేహం తేలియాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా.. అది కనిపించకుండా పోయిన సుశాంత్దేనని అధికారులు నిర్ధారించారు. తల్లి మందలించిందనే మనోవేదనతోనే బాలుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాక గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈనాటి డిజిటల్ యుగంలో చిన్న విషయాలకే యువత తీవ్ర మనస్తాపానికి గురై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, యువతకు సంబంధించిన మానసిక ఆరోగ్యం, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. పోలీస్శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!