Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఒక ఘోర ఘటన వెలుగుచూసింది. కేవలం మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తల్లి మందలించిందనే చిన్న కారణంతో.. 17 ఏళ్ల సుశాంత్ అనే బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సుశాంత్ ప్రతిరోజూ ఫోన్ను ఎక్కువగా చూస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. దీనిపై గమనించిన తల్లి, ఫోన్ అంతగా చూడొద్దని.. చదువుపై దృష్టి పెట్టాలని కాస్త గట్టిగా మందలించింది.
తల్లి మాటలకు తీవ్రంగా అలిగిన సుశాంత్, క్షణికావేశంలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతని మొబైల్ నంబర్కు ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలింపు చేపట్టినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో, చివరకు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
ఈ క్రమంలోనే స్థానిక గుంతూరు చెరువులో ఒక మృతదేహం తేలియాడుతోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా.. అది కనిపించకుండా పోయిన సుశాంత్దేనని అధికారులు నిర్ధారించారు. తల్లి మందలించిందనే మనోవేదనతోనే బాలుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాక గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈనాటి డిజిటల్ యుగంలో చిన్న విషయాలకే యువత తీవ్ర మనస్తాపానికి గురై ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఎలాంటి సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు, యువతకు సంబంధించిన మానసిక ఆరోగ్యం, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!