Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు లోలోపల అమరావతిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్కు తిరుపతిని రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రాజధానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ భవనాలు తప్ప మరేమీ ఉండవని అన్నారు. ఈ రోజుల్లో పరిపాలన అంతా డిజిటల్ విధానాల్లో జరుగుతోందని చెబుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో రాజధాని నిర్మాణం ఎందుకు అవసరమని ప్రశ్నించారు. లక్ష ఎకరాల భూమితో రాజధాని నిర్మాణం చేయడం వల్ల రాష్ట్రానికి అప్పులు, నష్టాలే తప్ప లాభం ఉండదన్నారు. అందుకే తిరుపతిని ఏపీ రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక రాష్ట్రంలోని సహజ వనరుల వినియోగంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు చింతామోహన.. చంద్రబాబు ప్రభుత్వం సహజ వనరులను దోపిడి చేస్తోందని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల విలువైన వనరులు అక్రమంగా తరలిపోతున్నాయని, సత్యవేడులో వేలాది టిప్పర్లతో ఇసుక దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సిలికా, క్వార్ట్జ్ ఖనిజాలు భారీ ఎత్తున తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read
- Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Kitchen Tips: ఉడికించిన బంగాళాదుంపల తొక్క తీసేటప్పుడు చేతులు కాలుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్తో క్షణాల్లో తొక్క ఊడిపోతుంది!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య అసమానతలు
దేశ రాజకీయ వ్యవస్థపై ప్రభావం చూపే డీలిమిటేషన్ అంశంపైనా చింతా మోహన్ స్పందించారు. డీలిమిటేషన్ వల్ల ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల ప్రజాప్రాతినిధ్యంలో తీవ్ర అసమానతలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉత్తర భారతానికి 600 సీట్లు వస్తే, దక్షిణ భారతానికి కేవలం 200 సీట్లు మాత్రమే వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశంలో ప్రాంతీయ అసమతుల్యత పెరిగే ప్రమాదం ఉందని, ఇది చాలా సున్నితమైన సమస్య అని హెచ్చరించారు. భారత్ కూడా ఒకప్పుడు Division of Germany లాగా విభజన భావజాలానికి లోనయ్యే అవకాశం ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ వరకు పరిమితమైతే సరిపోతుందని, డీలిమిటేషన్ పెంపుపై తొందరపడవద్దని కేంద్ర ప్రభుత్వానికి సున్నితంగా హెచ్చరిస్తున్నానని డా. చింతా మోహన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
-
Tollywood 2026 First Half: సోసోగా ఫస్ట్ హాఫ్ ..ఆశలన్నీ సెకండాఫ్ మీదే?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!