China’s Spy Ship: పాకిస్థాన్తో ఉద్రిక్తతలు.. భారత్ సమీపంలో చైనా గూఢచారి నౌక..
- భారత జలాల దగ్గరకు చైనా గూఢచారి నౌక
- ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో
- ఈ నౌక కార్యకలాపాలపై అనుమానాలు
- ఇది సముద్ర సర్వే నౌక అని చెబుతున్న చైనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
READ MORE: Minister Dola Bala Veeranjaneya Swamy: దివ్యాంగులపై సర్కార్ కీలక నిర్ణయం..
Also Read
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) ప్రకారం.. చైనా భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక సర్వే నౌక డా యాంగ్ యి హావో – సముద్రగర్భాన్ని మ్యాప్ చేయగలదు. సబ్మెర్సిబుల్ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక మే 12-13 తేదీల మధ్య అండమాన్, నికోబార్ దీవులను దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చేరుకుంది. మే 14న, ఇది భారతదేశానికి ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో కనిపించింది. అప్పటి నుండి ఓడ దాని ట్రాన్స్పాండర్ను ఆపివేయడం వలన దాని స్థానాన్ని ట్రాక్ చేయడం కష్టమైంది.
READ MORE: Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు ఉచితంగా ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయం..
పాకిస్థాన్కు చైనా ఎలా సహాయం చేయగలదు?
చైనా తన గూఢచారి నౌకల సహాయంతో భారత జలాల్లో జలాంతర్గాముల కార్యకలాపాలను ట్రాక్ చేయగలదు. ఆ గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు. ఒకవేళ పాకిస్థాన్లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే, వాటిని ముందుగానే పసిగట్టి, సదరు సమాచారాన్ని పాకిస్థాన్కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు.
చైనా ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) కింద చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సీపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదట్నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనక కారణం కావొచ్చు. భారతదేశంపై నిఘా ఉంచడంలో పాకిస్తాన్ నావికాదళానికి సహాయపడుతుంది. ఈ నౌక భారత నావికా దళాల మధ్య కమ్యూనికేషన్లను అడ్డుకోగలదు. భారతీయ కార్యాచరణ ప్రోటోకాల్లు, సంక్షోభ ప్రతిస్పందనలపై సమాచారాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
-
Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్తో ‘జై షా’ కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!