China Rocket: పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Rocket: సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్ శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది. చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.
స్పేస్లో న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా చైనా గత సోమవారం చివరి మాడ్యూల్ను భూమి నుంచి పంపించింది. చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. 23 టన్నులు బరువున్న రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్ను దీని ద్వారా పంపారు. అయితే, ఈ రాకెట్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ వ్యోమనౌక భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ.. కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. శకలాలు ఎక్కడ పడతాయోనని పలు దేశాలు భయాందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అవి సురక్షితంగా పసఫిక్ మహాసముద్రంలో పడ్డాయి.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Morbi Bridge Tragedy: గుజరాత్ వంతెన దుర్ఘటన.. మున్సిపల్ సీనియర్ అధికారిపై వేటు
డ్రాగన్ ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దక్షిణ మధ్య పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్లు అమెరికా స్పేస్ కమాండ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇదే రాకెట్కు చెందిన మరో శకలం ఉదయం 4:06 గంటల సమయంలో ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో పడిపోయినట్లు ట్వీట్ చేసింది. అవి సముద్రంలో పడిపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి లాబోరేటరీ మాడ్యూల్ను పంపించడానికి చైనా రాకెట్ను పంపించడం ఇది నాలుగోసారి. 2020 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు రాకెట్ ప్రయోగాలు చేపట్టారు. కాగా ఇంతకు ముందు కూడా మూడు సార్లు రాకెట్ శకలాలు ఇలా భూకక్ష్యకు దిగువకు చేరుకుని తిరిగి భూమివైపు పడిపోయాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!