China Rocket: పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు.. తప్పిన ప్రాణనష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Rocket: సైంటిస్టులు ఉత్కంఠగా ఎదురుచూసిన చైనా భారీ రాకెట్ శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడిపోయాయి. మహాసముద్రంలో శకలాలు పడడంతో ప్రాణనష్టం తప్పింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా స్పేస్ కమాండ్ ధ్రువీకరించింది. చైనాకు చెందిన ఓ భారీ రాకెట్ శకలాలు నియంత్రణ లేకుండా భూమిపై పడనున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పిన అంచనాలతో పలు దేశాల్లో భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే.
స్పేస్లో న్యూ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా చైనా గత సోమవారం చివరి మాడ్యూల్ను భూమి నుంచి పంపించింది. చైనా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన రాకెట్, లాంగ్ మార్చ్ 5బీ అక్టోబర్ 31న నింగిలోకి దూసుకెళ్లింది. 23 టన్నులు బరువున్న రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్షంలో చైనా నిర్మిస్తున్న స్పేస్ స్టేషన్కు 20 టన్నుల బరువున్న మెంగ్టియన్ లాబొరేటరీ క్యాబిన్ మాడ్యూల్ను దీని ద్వారా పంపారు. అయితే, ఈ రాకెట్ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 10 అంతస్తుల భవనమంతా పెద్దగా ఉండే ఈ వ్యోమనౌక భూ వాతావరణంలోకి చేరుకున్న తర్వాత కొంతభాగం కాలిపోయినప్పటికీ.. కొన్ని ప్రధాన భాగాలు అలాగే భూమిపై పడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. శకలాలు ఎక్కడ పడతాయోనని పలు దేశాలు భయాందోళనకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో అవి సురక్షితంగా పసఫిక్ మహాసముద్రంలో పడ్డాయి.
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- OdalaRevu Fishermens: చుట్టూ చీకటి.. చాలా భయమేసింది.. 23 రోజులు నరకయాతన అనుభవించాం!
Morbi Bridge Tragedy: గుజరాత్ వంతెన దుర్ఘటన.. మున్సిపల్ సీనియర్ అధికారిపై వేటు
డ్రాగన్ ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ స్థానిక కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దక్షిణ మధ్య పసిఫిక్ మహాసముద్రం మీదుగా భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించినట్లు అమెరికా స్పేస్ కమాండ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇదే రాకెట్కు చెందిన మరో శకలం ఉదయం 4:06 గంటల సమయంలో ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో పడిపోయినట్లు ట్వీట్ చేసింది. అవి సముద్రంలో పడిపోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణానికి లాబోరేటరీ మాడ్యూల్ను పంపించడానికి చైనా రాకెట్ను పంపించడం ఇది నాలుగోసారి. 2020 నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు రాకెట్ ప్రయోగాలు చేపట్టారు. కాగా ఇంతకు ముందు కూడా మూడు సార్లు రాకెట్ శకలాలు ఇలా భూకక్ష్యకు దిగువకు చేరుకుని తిరిగి భూమివైపు పడిపోయాయి.
తాజావార్తలు
-
Yamaha YZF-R2: R15 కంటే మరింత పవర్ఫుల్! 26.1bhp పవర్తో కొత్త Yamaha YZF-R2 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!