Kite Manja : వాహనదారుడి మెడకు చుట్టుకున్న చైనా మాంజా.. తీవ్ర రక్తస్రావం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం
- చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడం
- అతని మెడకు తీవ్రంగా గాయమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kite Manja : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో చైనా మాంజా ఉపయోగంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేసేందుకు వాడిన నిషేధిత చైనా మాంజా ద్విచక్ర వాహనదారుడి మెడకు చుట్టుకోవడంతో అతని మెడకు తీవ్రంగా గాయమైంది. ఈ ఘటనలో రక్తస్రావం అధికంగా కావడంతో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు అతనిని కొత్తగూడెంలోని ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తర్వాత హైదరాబాద్కి తరలించారు.
నిర్వహణ , నిషేధ ఆదేశాలున్నప్పటికీ, చైనా మాంజా ఇప్పటికీ మార్కెట్లో విరివిగా లభిస్తోంది. దాని ప్రమాదకరమైన ధారాలు అత్యంత పదునైనవి కావడం వల్ల ప్రయాణికులు, పక్షులు ,ఇతరులు గాయపడి ప్రాణాలు కోల్పోవడం తారసపడుతోంది. చైనా మాంజా తగిలి గతంలోనూ అనేక చోట్ల ప్రమాదాలు సంభవించాయి. పతంగి పోటీల్లో ఉత్సాహంతో పిల్లలు చైనా మాంజా కొనుగోలు చేసి పతంగులను ఎగరేస్తున్నారు. అయితే, దాని వినియోగం వల్ల తీవ్ర పరిణామాలు కలగవచ్చని వారు అవగాహనలో లేకపోవడం దురదృష్టకరం.
Also Read
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
పతంగుల మాంజా వల్ల పక్షుల మీద గాయాలు, మరణాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. గాలిలో స్వేచ్ఛగా ఎగరే పక్షులు చైనా మాంజా తగిలి గాయపడటం అనివార్యం అవుతోంది. ఈ కారణంగా పక్షుల సంరక్షణకు ప్రాధాన్యత కల్పించి చైనా మాంజాను పూర్తిగా నిషేధించడంపై మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగరేసేవారు చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. చైనా మాంజా వల్ల తలెత్తే ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లు , మార్కెట్లో ఈ నిషేధిత మాంజా విక్రయాన్ని నియంత్రించేందుకు అధికారాలు మరింత చురుకుగా ఉండాలని కోరుతున్నారు.
సంక్రాంతి వంటి పండుగలు ఆనందంతో పాటు భద్రతకూ ప్రాధాన్యత ఇవ్వాలి. చైనా మాంజా వినియోగం వల్ల కలిగే అనర్థాలు ప్రజల జీవితాలను భయంకరంగా మార్చవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించి భద్రతాపరమైన చర్యలను పాటించాలి.
Bhopal Gas Tragedy: భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన 40 ఏళ్లకు కీలక నిర్ణయం..
తాజావార్తలు
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!