China: షాకింగ్ తీర్పు.. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి మరణశిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: చైనా కోర్టు షాకింగ్ తీర్పు వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులకు మరణశిక్ష విధించింది. ఈ కుటుంబం ఒక క్రిమినల్ ముఠాను నడిపింది. హత్య, మోసం, వ్యభిచారం, మనీలాండరింగ్ లాంటి అనేక తీవ్రమైన నేరాలకు పాల్పడింది. ఈ నేరాలపై విచారణ చేపట్టిన కోర్టు.. వెన్జౌ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మయన్మార్లోని కోకాంగ్లో నివాసం ఉంటున్న మింగ్ గుపింగ్, మింగ్ జెన్జెన్, జౌ వీచాంగ్లతో పాటు మరో ఎనిమిది మందికి మరణశిక్ష విధించింది. కోర్టు మరో ఐదుగురికి రెండేళ్ల సస్పెండ్ మరణశిక్షలు విధించగా, మరో 12 మంది నిందితులకు ఐదు నుంచి 24 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది.
READ MORE: Indian Army Chief Warns Pak: పాకిస్తాన్ ను భూగోళంలో లేకుండా చేస్తాం.. ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
వారు చేసిన నేరాల గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈ కుటుంబాన్ని అపఖ్యాతి పాలైన మింగ్ కుటుంబం అని పిలుస్తారు. వీళ్లు 1.4 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అక్రమ జూదం వ్యాపారాన్ని నడిపారు. అనేక మంది ఉద్యోగులను హత్య చేయడమే కాకుండా వ్యభిచారంలో పాల్గొనేలా చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. చైనా రాష్ట్ర ప్రసార సంస్థ CCTV ప్రకారం.. 2015 నుంచి మింగ్ కుటుంబం తూర్పు చైనా ప్రావిన్స్ జెజియాంగ్లో భారీ నేర నెట్వర్క్ను నడుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కుటుంబ ముఠా మయన్మార్లోని కోకాంగ్ ప్రాంతంలో నుంచి అన్ని నేర కార్యకలాపాలను నిర్వహించేవారు. టెలికాం మోసం, అక్రమ క్యాసినో, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి వివిధ నేరాలలో చేశారు. ఈ అక్రమ వ్యాపారాల నుంచి దాదాపు 10 బిలియన్ యువాన్లు అంటే రూ. 12 వేల కోట్లకు పైగా సంపాదించారు.
READ MORE: Avatar 3: ‘అవతార్: స్నీక్ పీక్తో ‘ది వే ఆఫ్ వాటర్’ రీ-రిలీజ్
మింగ్ కుటుంబం చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదు.. ఉద్యోగులను విదేశాల నుంచి ఆకర్షించారు. ఇందులో ఎక్కువ మంది చైనా పౌరులు అధికంగా ఉన్నారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు తెలుసుకున్న ఉద్యోగులు ఈ స్థావరాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నించారు. మాట వినని వారిని అక్కడే హింసించి చంపేశారు. రెండేళ్ల క్రితం బాధిత కుటుంబీకులు లౌకై ప్రాంతంలోని స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో మింగ్ కుటుంబ పితృస్వామ్యుడు మరణించాడు. తదనంతరం, మింగ్ కుటుంబం చేసిన నేరాలు బయటపడ్డాయి. వారందరినీ చైనా పోలీసులు అరెస్టు చేశారు. కేసు కోర్టు చేరడంతో జెజియాంగ్ కోర్టు ఫిబ్రవరిలో మొదటిసారి కేసును విచారించింది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!