Revanth Reddy: సత్యహరిచంద్రుడు లెక్క హరీష్ మట్లాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ సాగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. ఇంకా హరీష్ మంత్రి అనుకుంటున్నారు.. మంత్రిలాగా వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం మీద వివరాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. 1.34 లక్షల కోట్లకు టెండర్లు పిలిచారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని సీఎం తెలిపారు. సత్యహరిచంద్రుడు లెక్క హరీష్ మట్లాడుతున్నారని విమర్శించారు. తప్పు ఒప్పుకుని.. క్షమించండి అని అంటే హుందాగా ఉండేదని సీఎం తెలిపారు. తాము కూడపెట్టిన సంపద అడ్డుపెట్టుకుని.. తనకా పెట్టారని సీఎం మండిపడ్డారు.
INDIA bloc: “ఇండియా కూటమి సమావేశంలో సమోసాలు కూడా లేవు”.. కాంగ్రెస్పై ఎంపీ విమర్శలు..
Also Read
రూ.13 లక్షల 72 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు.. దళితులకు మూడు ఎకరాల ఇవ్వలేదు.. రాజీవ్ ఆరోగ్య శ్రీకి నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. హాస్టల్ లో వంట చేసే వాళ్లకు కూడా జీతభత్యాలు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులకు మొదట రోజు జీతాలు వెయ్యలేదు ఎందుకని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకుని అన్నాడు కేసీఆర్.. కానీ వాళ్లకు కూడా నెల నెల పెన్షన్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
CM YS Jagan: 8వ తరగతి విద్యార్థులకు గుడ్న్యూస్.. రేపే సీఎం చేతులమీదుగా ఉచితంగా ట్యాబ్లు
ఓఆర్ఆర్ మేము సృష్టిస్తే.. వీళ్ళు అమ్ముకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైన్ షాప్ టెండర్ కూడా నాలుగు నెలల ముందు పిలిచాడని తెలిపారు. వచ్చేటోడు.. నిలబడే పరిస్థితి కూడా లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్తే సిగ్గు పోతుంది అంటున్నారు.. ఊరుకుంటే ప్రాణాలు పోతాయని ముఖ్యమంత్రి తెలిపారు. వెట్టిచాకిరి నిషేదించాం.. బీఆర్ఎస్ వాళ్లకు కూడా స్వేచ్ఛ ఇస్తున్నామని ఈ సందర్భంగా సభలో అన్నారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!