Chicken Price Hike: నాన్వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!
- నాన్వెజ్ ప్రియులకు భారీ షాక్
- తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు
- నాలుగొందలు పెట్టి చికెన్ కొనాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Prices Hit RS 400 Per kg in AP and Telangana: నాన్వెజ్ ప్రియులకు భారీ షాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కిలో చికెన్ ధర ఏకంగా రూ.400 (స్కిన్లెస్)కు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో బోన్లెస్ రూ.400కి పైగా విక్రయిస్తున్నారు. విజయవాడలో ఈరోజు కేజీ రూ.400గా నమోదయింది. గత వారం కిలో చికెన్ రూ.300గా ఉండగా.. ఇప్పుడు 400కు చేరింది. ఒక్కసారిగా రూ.100 పెరగడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. చికెన్ ధర ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కేజీ చికెన్ ధర సాధారణంగా రూ.170 నుంచి రూ.220 మధ్య ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే ఇంకా తక్కువగా ఉంటుంది. కానీ గత 2 నెలల నుంచి ధరల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి మధ్య నుంచి భారీగా పెరుగుతోంది. ఎండల తీవ్రత కారణంగా కోళ్లు చనిపోవడం, రంజాన్ డిమాండ్ కారణంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.400కు చేరడంతో కొనుగోలుదారులు వెనుదిరుగుతున్నారు. ‘వామ్మో.. నాలుగొందలు పెట్టి చికెన్ కొనాలా?’ అంటూ చాలామంది మార్కెట్ వద్దే వెనక్కి వెళ్లిపోతున్నారు.
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
ఇప్పటికే గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై పెను భారం పడింది. ఈ సమయంలో చికెన్ ధరలు కూడా పెరగడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. రోజువారీ ఖర్చులు పెరుగుతుండటంతో.. మాంసాహారం కొనడం కూడా చాలా మందికి భారంగా మారుతోంది. ధరలు పెరగడంతో చికెన్ మార్కెట్లో కొనుగోళ్లు గణనీయంగా తగ్గాయి. దాంతో వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కస్టమర్లు రాకపోవడంతో చికెన్ మార్కెట్ వెలవెలబోతోంది. విక్రయాలు తగ్గిపోవడంతో వ్యాపారులకు తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు సరఫరా కొరత, డిమాండ్-సప్లై అసమతుల్యత అని వ్యాపారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
-
FIFA ఫైనల్లో ట్రంప్కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!