IPL Auction 2024: కివీస్ స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిన చెన్నై ఫ్రాంఛైజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది. ఈ ఆక్షన్లో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు కోట్లు కుమ్మరించారు. ఈ క్రమంలో.. చెన్నై సూపర్ కింగ్స్ యాజమన్యం కివీస్ స్టార్ ప్లేయర్లను తమ జట్టులోకి తీసుకుంది. వేలంపాటలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్పై కోట్ల రూపాయల వర్షం కురిసింది. ఈ క్రమంలో చివరకు చెన్నై సూపర్ కింగ్స్ డారిల్ మిచెల్ను 14 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. అతని బేస్ ధర రూ. 1 కోటి, అయితే అతను 14 రెట్లు ఎక్కువకు కొనుగోలు చేశారు. ముందుగా మిచెల్ కోసం ఢిల్లీ, పంజాబ్లు వేలం వేయగా.. ధర పెరగడంతో ఢిల్లీ జట్టు వెనుదిరిగింది. ఈ క్రమంలో చెన్నై మిచెల్ ను కొనుగోలు చేసింది.
Read Also: MLC Jeevan Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులను ఉరి తీయాలి..
Also Read
కాగా.. కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను కూడా సీఎస్కే కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లు చెల్లించి రచిన్ను తమ జట్టులో చేర్చుకుంది. 2023 వన్డే ప్రపంచకప్లో రచిన్ జట్టు తరుఫున స్టార్ ఆటగాడిగా నిలిచాడు. అతను టోర్నమెంట్లో అత్యధిక స్కోరర్గా నాల్గొవ స్థానంలో నిలిచాడు. తన బేస్ ధరను రూ.50 లక్షలు ఉండగా.. బేస్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను చేర్చుకుంది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న శార్దూల్ ఠాకూర్ ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకుముందు.. శార్దూల్ కోల్కతా నైట్ రైడర్స్ తరుఫున ఆడాడు.
Read Also: Nizamabad: సంచలనం రేపిన ఆరుగురు హత్య కేసును ఛేదించిన కామారెడ్డి పోలీసులు..
- Tags
- Auction
- chennai
- franchise
- ipl
- newzealand
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!