Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులోని విల్లుపురం జిల్లా , చెంగల్పట్టు జిల్లాల్లోని సంభవించిన కల్తీ మద్యం మరణాల సంఖ్య బుధవారానికి 21కి చేరింది. ఈ కల్తీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొంత మంది అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే మిథనాల్ను విక్రయించిన చెన్నైకి చెందిన ఫ్యాక్టరీ యజమానిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమానితో పాటు అతని నుంచి మిథనాల్ను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు, దానిని రవాణా చేయడంలో సహకరించిన వారు అరెస్టయ్యారు. రాష్ట్రంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్ల ప్రజలు పారిశ్రామికంగా మిథనాల్ తాగే పరిస్థితి నెలకొందని రాష్ట్ర పోలీసు చీఫ్ డాక్టర్ శైలేంద్రబాబు అన్నారు. కల్తీ మద్యానికి చెక్ పెట్టడం వల్లనే ప్రజలు మిథనాల్కు వెళ్తున్నారని అన్నారు.
జయశక్తి ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అయిన ఇళయనంబి ఇద్దరు వ్యక్తులకు 1,200 లీటర్ల మిథనాల్ను అక్రమంగా విక్రయించినట్లు పోలీసు చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహమ్మారి సమయంలో అతని ఫ్యాక్టరీ మూసివేయబడిన తర్వాత మిథనాల్ ఉపయోగించకుండా పడి ఉంది. ఇద్దరు వ్యక్తులకు సుమారు 8 లీటర్లు సరఫరా చేశారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో 21 మంది మృతి చెందారు. మరో 30 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1,192 లీటర్ల మిథనాల్ను స్వాధీనం చేసుకున్నామని, దీంతో పెద్ద విషాదం తప్పిందని పోలీసు చీఫ్ పేర్కొన్నారు. ఇళయనంబి, “1,200 లీటర్లను రూ. 60,000కి” విక్రయించారు. మిథనాల్ని ఉపయోగించి అన్ని ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లలో మిథనాల్ స్టాక్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
- LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
Read Also: America: ఆఫీస్కు వెళ్తూ అదృశ్యం.. పక్క రాష్ట్రంలో శవమై కనిపించిన భారత సంతతి మహిళ
ఈ సంఘటన చట్ట అమలు సంస్థల వైఫల్యంగా పరిగణించబడుతుంది. విల్లుపురం పోలీసు సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీలతో సహా 10 మంది పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చెంగల్పట్టు టాప్ కాప్ బదిలీ అయ్యారు. పారిశ్రామిక మిథనాల్ లభ్యతను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సహాయాన్ని ప్రకటించారు.ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ అంశంపై అధికార డీఎంకేను “అసమర్థత”గా అభివర్ణించాయి.
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
-
Trigun: ప్రధాని మాటే మా సినిమాకు బలం.. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ టీమ్!
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
Marksheet Cake: ముంబై టు సోషల్ మీడియా.. నెట్టింట వైరల్ అవుతున్న ‘మార్క్షీట్’ సెలబ్రేషన్!
-
LayOffs: మరో దిగ్గజ కంపెనీలో భారీగా లే ఆఫ్స్.. 4000 మంది ఉద్యోగుల తొలగింపు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?