Tamilnadu: 21 మంది మృతికి కారణమైన మిథనాల్ దుర్ఘటన.. ఫ్యాక్టరీ యజమాని అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులోని విల్లుపురం జిల్లా , చెంగల్పట్టు జిల్లాల్లోని సంభవించిన కల్తీ మద్యం మరణాల సంఖ్య బుధవారానికి 21కి చేరింది. ఈ కల్తీ మద్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కొంత మంది అధికారులను కూడా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కల్తీ మద్యం ఎవరు తయారు చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు ఉపయోగించే మిథనాల్ను విక్రయించిన చెన్నైకి చెందిన ఫ్యాక్టరీ యజమానిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 16 మందిని అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమానితో పాటు అతని నుంచి మిథనాల్ను కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు, దానిని రవాణా చేయడంలో సహకరించిన వారు అరెస్టయ్యారు. రాష్ట్రంలో కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్ల ప్రజలు పారిశ్రామికంగా మిథనాల్ తాగే పరిస్థితి నెలకొందని రాష్ట్ర పోలీసు చీఫ్ డాక్టర్ శైలేంద్రబాబు అన్నారు. కల్తీ మద్యానికి చెక్ పెట్టడం వల్లనే ప్రజలు మిథనాల్కు వెళ్తున్నారని అన్నారు.
జయశక్తి ప్రైవేట్ లిమిటెడ్ యజమాని అయిన ఇళయనంబి ఇద్దరు వ్యక్తులకు 1,200 లీటర్ల మిథనాల్ను అక్రమంగా విక్రయించినట్లు పోలీసు చీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహమ్మారి సమయంలో అతని ఫ్యాక్టరీ మూసివేయబడిన తర్వాత మిథనాల్ ఉపయోగించకుండా పడి ఉంది. ఇద్దరు వ్యక్తులకు సుమారు 8 లీటర్లు సరఫరా చేశారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో 21 మంది మృతి చెందారు. మరో 30 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1,192 లీటర్ల మిథనాల్ను స్వాధీనం చేసుకున్నామని, దీంతో పెద్ద విషాదం తప్పిందని పోలీసు చీఫ్ పేర్కొన్నారు. ఇళయనంబి, “1,200 లీటర్లను రూ. 60,000కి” విక్రయించారు. మిథనాల్ని ఉపయోగించి అన్ని ఫ్యాక్టరీలు, తయారీ యూనిట్లలో మిథనాల్ స్టాక్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
Read Also: America: ఆఫీస్కు వెళ్తూ అదృశ్యం.. పక్క రాష్ట్రంలో శవమై కనిపించిన భారత సంతతి మహిళ
ఈ సంఘటన చట్ట అమలు సంస్థల వైఫల్యంగా పరిగణించబడుతుంది. విల్లుపురం పోలీసు సూపరింటెండెంట్, ఇద్దరు డిప్యూటీలతో సహా 10 మంది పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చెంగల్పట్టు టాప్ కాప్ బదిలీ అయ్యారు. పారిశ్రామిక మిథనాల్ లభ్యతను పూడ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల సహాయాన్ని ప్రకటించారు.ప్రతిపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ అంశంపై అధికార డీఎంకేను “అసమర్థత”గా అభివర్ణించాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!