Char Dham Yatra 2025: ఏప్రిల్ 30 నుంచి చార్ ధామ్ యాత్ర షురూ..
- చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30 నుంచి మొదలు.
- ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Char Dham Yatra 2025: హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన యాత్రలలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే చార్ ధామ్ యాత్ర. ఈ యాత్రను ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రంగా భావించడంతో పాటు, మోక్షాన్ని ప్రసాదించేదిగా కూడా నమ్ముతారు భక్తులు. ప్రతేడాది లక్షలాది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటుంటారు. 2024లో ఈ యాత్రలో 30 లక్షలకు పైగా భక్తులు పాల్గొనగా.. 2025లో ఈ యాత్ర ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లయితే..
ఏప్రిల్ 30న యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి. ఆ తర్వాత మే 2న కేదారనాథ్ ఆలయం ప్రారంభం కానుంది. ఇలా చివరగా మే 4న బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం అందించనుంది. అలాగే ఈ ఆలయాల మూసే తేదీలను కూడా ప్రకటించారు. అక్టోబర్ 22న యమునోత్రి ఆలయం, అక్టోబర్ 23న గంగోత్రి, కేదారనాథ్ ఆలయాలు మూతపడనున్నాయి. ఇక చివరగా నవంబర్ 6న బద్రీనాథ్ ఆలయం మూసివేయనున్నారు అధికారులు.
Also Read
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
- Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
- First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
Also Read: Stock Market: అమెరికా ప్రకటనతో భారీ లాభాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్
ఇక చార్ ధామ్ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నమోదు చేయాలి. ఇందులో భాగంగా ఇమెయిల్, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, ఓటర్ ఐడి అప్లోడ్ చేయాలి. కచ్చితంగా తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఈ-పాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ పక్రియను చూసినట్లయితే.. డెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోన్ప్రయాగ్ కేంద్రాలలో నమోదు చేసుకోవచ్చు. అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు, మెడికల్ సర్టిఫికేట్, ఇంకా ఫోటో సమర్పించాలి. అక్కడి అధికారుల తాజా సమాచారం ప్రకారం, ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి విధించలేదని తెలిపారు. ట్రాఫిక్, తాగునీరు, పార్కింగ్ వంటి సదుపాయాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Nagabandham: ‘నాగబంధం’ మేకర్స్ ఊహించని నిర్ణయం!
-
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
-
CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
-
Tata Motors: మారుతిని వెనక్కి నెట్టిన టాటా పంచ్.. జూన్లో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే!
-
Sachin Tendulkar: టీ20ల్లో వైభవ్ సరికొత్త చరిత్ర.. కానీ సచిన్కి చెందిన ఈ రికార్డులను తాకడం అంత ఈజీ కాదు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..