Nayantara : మరో వివాదంలో నయన్.. నోటీసులు పంపిన చంద్రముఖి నిర్మాత
- మరో సమస్యలో చిక్కుకున్న నయన్
- డాక్యుమెంటరీపై మరో నిర్మాత నోటీసులు
- రూ.5కోట్లు చెల్లించాలని డిమాండ్
Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార కొన్ని రోజులుగా వార్తల ముఖ్యాంశాల్లో నిలిచారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు ఆమెకు మధ్య కాపీ రైట్ వివాదం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. తన సినిమా పుటేజీని అనుమతి లేకుండా నయనతార డాక్యుమెంటరీ (బియండ్ ది పెయిర్ టేల్)లో ఉపయోగించారని.. అలా ఎలా ఉపయోగిస్తారని ధనుష్ రూ.10 కోట్లు దావా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా నయనతారకు మరో సమస్య ఎదురైంది. ఈ డాక్యుమెంటరీలోనే ‘చంద్రముఖి’ సినిమాలోని కొన్ని క్లిప్పింగులను అనుమతి లేకుండా ఉపయోగించినట్లు తెర మీదకు వచ్చింది. దీంతో ఆ సినిమా నిర్మాతలు నయనరతార, ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాం నెట్ ప్లిక్స్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తమ కంటెంట్ ను చట్ట విరుద్దంగా వినియోగించుకున్నందకు రూ.5 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని నోటీసులిచ్చినట్లు సమాచారం. దీంతో’బియాండ్ ది పెయిర్ టేల్’ మళ్లీ నెట్టింట్లో హాట్ టాపిక్ అయింది.
Read Also:Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ధనుష్ కి ఇప్పుడు ‘చంద్రముఖి’ నిర్మాతలు రామ్ కుమార్ గణేషన్, ప్రభులు కూడా తోడయ్యారు. డాక్యుమెంటరీపై కలిసి మరిన్ని కేసులు వేసేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. ‘చంద్రముఖి’ నిర్మాతల రియాక్షన్ నేపథ్యంలో నయన్ ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తికరంగా మారింది. ధనుష్ విషయంలో ఇప్పటికే నయన్ తాను చెప్పాలనుకున్నదంతా బహిరంగంగా లేఖ రాసింది. తాను చెప్పాలనుకున్నది అంతా చెప్పేసింది. ధనుష్ అనుమతి కోసం ఎంత ప్రయత్నించినా తాను టచ్ లోకి రాకపోవడంతోనే తన మేనేజర్ తో మాట్లాడి ముందుకెళ్లినట్లు స్పష్టం చేసింది. అలాగే ధనుష్కు తనపై ఎందుకంత కోపంగా ఉన్నాడో? ఎందుకు అంతగా ద్వేషిస్తున్నాడో? అర్దం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు తాను మంచి స్నేహితుడు గా ఉండేవాడని.. కానీ ఇప్పుడాయన పక్కన వాళ్ల మాటలు విని దూరం జరిగినట్లు చెప్పుకొచ్చింది. ఇలాంటివి క్లియర్ చేసుకోవడానికి ఆయనతో మాట్లాడలని ఎంత ప్రయత్నించినా ఫలించడం లేదన్నారు. న్యాయంగా , తప్పులేకుండా చేసిన ప్రయత్నం విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరి చంద్రముఖి నిర్మాతల విషయంలో ఎలా స్పందిస్తారో తెలియాలి.
Read Also:Pushpa 2: ఇండియన్ సినీ రికార్డులను తిరగరాసిన పుష్ప-2 ది రూల్
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!