Harish Rao: చంద్రబాబుకు మన మీద ప్రేమ ఉండదు.. ఇప్పుడు మంచి మాట చెప్పాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా.. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో 48 కోట్ల రూపాయలతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక నేడు 80 రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో తెలంగాణ రాక ముందు 682 మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండేవని.. నేడు 1012 స్కూల్స్ ఏర్పాటు చేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Pawan Kalyan: ఎవరి కళ్లలో ఆనందం కోసం అర్చకుడిపై దాడి.. పవన్ సూటి ప్రశ్న
Also Read
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
గత ప్రభుత్వాలు ఒక్క డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయలేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించాలని ఆయన తెలిపారు. సద్దితిన్న రేవు తలవాలన్నారు. చదువుకుంటున్న విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలపాలని సూచించారు. 2014 కు ముందు రెసిడెన్షియల్ విద్యపై పెట్టిన ఖర్చు రూ.970 కోట్లు, నేడు రూ.4000 కోట్లు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామని హరీష్ రావు తెలిపారు.
Rahul Flying Kiss Issue: వివాదంలో రాహుల్ గాంధీ ఫ్లైయింగ్ కిస్
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ఎప్పుడూ మన మీద ప్రేమ ఉండదని ఆరోపించారు. కానీ, మొన్న చంద్రబాబు తెలంగాణ భూములపై పాజిటివ్గా మాట్లాడారన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది, నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు ఎక్కువ.. ప్రచారం చేసేది తక్కువని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇంత మంచి ప్రభుత్వాన్ని.. చేసిన సేవలను గుర్తించి మరోసారి ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పంజాబ్ వరి ధాన్యంలో మొదటి స్థానంలో ఉంటే.. నేడు తెలంగాణ నెంబర్ వన్గా మారిందన్నారు. అంతేకాకుండా డాక్టర్ల ఉత్పత్తిలోనూ దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా మారిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి వచ్చి తెలంగాణలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!