CM Chandrababu: ప్రజలకు ఇదే నా హామీ.. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచం!
- సోలార్ ఇంగోట్ వేపర్ కేంద్రానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
- తొందర్లోనే ఏపీఎస్ ఆర్టీసీకి 1050 ఈవీ బస్సులు
- భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాంబిల్లి మండలంలో రెన్యు గ్లోబల్ సంస్థ సోలార్ ఇంగోట్ వేపర్ కేంద్రానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. గ్రీన్ ఎనర్జీ కోసం లక్షా 85 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పారు. తొందర్లోనే ఏపీఎస్ ఆర్టీసీకి 1050 ఈవీ బస్సులు వస్తాయని, భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామన్నారు. ప్రతీ ఇళ్లు ఓ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని, రైతులు కూడా పొలం దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ చార్జీలు పెంచమని రాంబిల్లి నుంచి ప్రజలకు హామీ ఇస్తున్నాని సీఎం తెలిపారు.
‘2024 ముందు రాష్ట్రంలో విధ్వంసం జరిగింది, అభివృద్ది ఆగిపోయింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి రీన్యూ ఎనర్జీ ముందుకు వచ్చింది. విద్యుత్ చార్జీలు పెంచమని ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అనాలోచిత నిర్ణయాలు, అవినీతి కారణంగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. గత ప్రభుత్వం 32 వేల కోట్లు ప్రజలపై విద్యుత్ భారం మోపింది. 160 గిగా వాట్ల రెన్యువబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఆర్టీసీలో వెయ్యి ఈవీ బస్సులు రానున్నాయి. ఆర్టీసీ బస్సులు అన్నీ ఈవీ బస్సులుగా వస్తాయి. పేద వాళ్లకు ఈ సౌకర్యం అందుబాటలోకి తేవడం కోసం పనిచేస్తున్నాం. ప్రతీ ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలి. అవసరాలు తీరిన తర్వాత తిరిగి గ్రిడ్ కు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. భవిష్యత్తులోనూ కరెంట్ చార్జీలు పెంచం. రాంబిల్లి నుంచి ప్రజలకు ఇదే నా హామీ. విద్యుత్ ట్రాన్స్ మిషన్ లాస్ తగ్గించగలిగాం. టూ డౌన్ చార్జెస్ తగ్గించడం వల్ల భారం తగ్గింది’ అని సీఎం చెప్పారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
’15 వేల 700 కోట్లు డిస్కంల నష్టాన్ని ప్రభుత్వం భరించింది. 22 నెలల్లో 800కు పైగా ఒప్పందాలు జరిగాయి. ప్రతీ ఒప్పందం కార్యాచరణకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా స్పీడ్ ఆఫ్ డెలివరీ విధానం అమలులో తెచ్చాం. 19-24 మధ్య రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామిక వేత్తలు పారిపోయారు. NDA బ్రాండ్ పారిశ్రామిక వేత్తలను ధైర్యం ఇచ్చింది. విధ్వంసం ఎవరిదో, వికాశం ఎవరి హయాంలో జరుగుతుందో ప్రజలు గురించాలి. జూలై మొదటి వారంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం ఉంటుంది. వర్షాలు ప్రారంభమైన వెంటనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు అందుతాయి. నేషనల్ హైవే విస్తరణ పనులు మొదలు పెడుతున్నాం’ అని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?