Chandrababu Naidu: రివర్స్ పాలనలో గేర్లు మార్చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రివర్స్ పాలన జరుగుతోంది.రివర్స్ పాలనలో జగన్ గేర్లు మారుస్తూ చాలా స్పీడుగా వెళ్తున్నారని.. దీంతో వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. యువత నిరాశకు లోనయ్యారు.. పెట్టుబడులు రావడం లేదు. సన్ రైజ్ ఏపీ అనే పేరుతో ఏపీలో పెట్టుబడులని ఆకర్షించాం.. గ్లోబల్ ఎడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాం. ఏపీలో వనరులను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల పరంగా విజన్ 2021 అని రూపొందించాం. విజన్ 2021 ప్రకారం టీడీపీ హయాంలో పని చేశాం అన్నారు.
Read Also: CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. ఎప్పుడంటే?
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
పెట్టుబడుల కోసం శ్రమించాం.. వివిధ రంగాల్లో ఏపీని నెంబర్-1గా నిలిపాం.పోర్టులను అనుసంధానం చేసుకుంటూ పోర్ట్ లెడ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాం.కృష్ణపట్నం నుంచి భావనపాడు వరకు పోర్టుల నిర్మాణం కోసం కృషి చేశాం.భావనపాడు పోర్ట్ అంటే టీడీపీ గుర్తొస్తుందని మూలపాడు పోర్టు అని పేరు మార్చారు.జగన్ కన్నార్పకుండా అబద్దాలు చెబుతారని చంద్రబాబు మండిపడ్డారు. హైదరాబాద్ కోసం రూపొందించిన విజన్ 2020 గురించి ఇప్పుడెవరైనా మాట్లాడితే వైసీపీ నేతలు చిర్రుబుర్రులాడుతున్నారన్నారు. మరోవైపు వర్షాల కారణంగా చంద్రబాబు పర్యటనలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన వుంది. అలాగే, 5వ తేదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న పంటలను పరిశీలించనున్నారు చంద్రబాబు.
కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం పెట్టుబడుల్లో ఏపీ అధోగతికి వెళ్లిపోయింది.టీడీపీ హయాంలో రూ. 6 లక్షల పెట్టుబడులు వచ్చాయి.. ఈ విషయాన్ని గౌతమ్ రెడ్డి కూడా చెప్పారు.కేవలం రూ. 5751 కోట్లు పెట్టుబడులు మాత్రమే వచ్చాయి.ఇంత తక్కువ పెట్టుబడులా..?పెట్టుబడుల విషయంలో దిగువ నుంచి ఏడో రాష్ట్రంగా ఉన్నారు.సీఎం జగనుకు సిగ్గు అనిపించడం లేదా..?
ఇంత తక్కువ పెట్టుబడులు వస్తే యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది.ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతున్నారు.మళ్లీ ఏపీ ముఖం నుంచి లూలూ గ్రూప్ అధినేత యూపీకి వెళ్లారు.. అక్కడ పెట్టుబడులు పెట్టారు.అదానీ డేటా సెంటరుకు ఆ రోజే ఫౌండేషన్ వేశాం.ఇప్పుడు సీఎం జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు.వేలాది కోట్ల పెట్టుబడులను వెనక్కు వెళ్లాయి.. ఎవరి పాపం ఇది.కడప స్టీల్ ప్లాంట్ కోసం సీఎం జగన్ రెండు సార్లు ఫౌండేషన్ వేశాడు.. ఇవేం తిక్క పనులు.ఇలాంటి పనులు సీఎం చేస్తే ఏపీలో ఉన్నవాళ్లంతా తిక్కొళ్లే అనుకుని ఎవ్వరూ పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదన్నారు.
Read Also: Vijaya Publications: ఎం.ఎల్. నరసింహం చెబుతున్న ‘పాట వెనుక భాగోతం’!
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
-
PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్గా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!