TDP: బిగ్ ట్విస్ట్.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఏపీలో ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వనున్నారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈలోపు ఇప్పటికే 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. తాజాగా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్ల సమీకరణల దృష్ట్యా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్పుల్లో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Kakarla Suresh: కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
Also Read
ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు చేసింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ టికెట్ బీజేపీకి ఇవ్వడంతో.. రఘురామకృష్ణంరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. దీనిలో భాగంగా రామరాజు స్థానంలో రఘురామకు ఉండి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళ రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబు బీఫామ్ అందజేయనున్నారు. అలాగే పాడేరు టికెట్ను కిల్లు వెంకట రమేష్ నాయుడుకు కేటాయించిన సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించడంలేదు. ఆయనను మార్చాలని అధిష్టానంపై స్థానిక నేతలు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.
మడకశిర నుంచి సునీల్ను అభ్యర్థిగా గతంలో ప్రకటించారు. అయితే టీడీపీలో కీలక నేతగా ఉన్న ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాజుకు మడకశిర టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని భావించినప్పటికీ.. ఆ టికెట్ను మాజీ ఐఎఎస్ కృష్ణప్రసాద్కు కేటాయించడంతో ఎంఎస్ రాజును మడకశిర నుంచి పోటీకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మిసాయిప్రియకు టీడీపీ టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు రామ్కుమార్ పోటీ చేస్తుండటంతో.. లక్ష్మిసాయిప్రియ స్థానంలో ఆమె తండ్రి కురుగుండ్ల రామకృష్ణను పోటీకి దింపాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు అన్నెపర్తి టికెట్పై క్లారిటీ రాకపోవడంతో దెందులూరు బీఫారంను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తోంది. బీఫారంను తీసుకునేందుకు రావద్దని చింతమనేనికి టీడీపీ అధిష్ఠానం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అటు అన్నెపర్తి బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉంటారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!