CM’s Meeting : ముగిసిన సీఎంల భేటీ.. విభజన సమస్యలపై కీలక నిర్ణయం
- ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
- విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు
- ఒకటి మంత్రుల కమిటీ కాగా.. మరోటి అధికారులతో కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది. అయితే.. ముందుగా ఒకరినొకరు ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా శాలువాలతో సత్కరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు’కాళోజీ-నాగొడవ’ పుస్తకాన్ని బహుకరించారు రేవంత్ రెడ్డి.
అయితే… ప్రజాభవన్లో కొనసాగిన ఈ భేటీలో విభజన సమస్యలను చర్చించారు. విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. అయితే.. ఐదు గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. విద్యుత్ బకాయిలపై ఏపీ ప్రస్తావించగా.. బకాయిలు చెల్లించేది లేదన్న తెలంగాణ వెల్లడించింది.. ఏపీ ప్రభుత్వమే విద్యుత్ బకాయి పడ్డారని తెలంగాణ తెలిపింది. విద్యుత్ బకాయి లెక్కలు సీఎంల ముందుంచారు ఇరు రాష్ట్రాల అధికారులు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
- Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
- US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
- Telegram Ban in India: భారత్లో టెలిగ్రామ్పై నిషేధం ఎందుకు..? వివాదానికి కారణమైన 5 కీలక ఫీచర్లు ఇవే
ఇకపోతే.. విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే… హైదరాబాద్లో ఉన్నస్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని చెప్పిన రేవంత్.జ స్థిరాస్తులు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించినట్లు పేర్కొన్నారు. ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక చివరగా విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయనున్నట్లు.. మంత్రులు కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం, శ్రీధర్బాబు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
-
Bangladesh: బంగ్లాదేశ్లో రాముడి విగ్రహ వివాదం.. రాడికల్ ఇస్లామిస్ట్ల బెదిరింపులు..
-
KTR : ఒక్క ఓటు కూడా పోవద్దు.!
-
Tata Motors: ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన టాటా మోటార్స్.. ఒకే రోజులో లక్షల కోట్లు లాస్! ఎందుకో తెలుసా?
-
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!