Chandra Sekhar Tatiparthi: సీఎం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా?
- సీఎం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?
- కొడుకును సీఎం చేసుకోవటానికి నిధులు మళ్లిస్తున్నారన్నారు
- మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా?.. లేదా ప్రజలందరి కోసం పనిచేస్తారా? అని వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి నిధులు మళ్లిస్తున్నారన్నారని, ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులుపెట్టి జైళ్లకు పంపిస్తున్నారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మంత్రి నిమ్మల మాటలతో సరిపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు.. విషం చిమ్మే నాయకుడు అన్నట్లుగా చిత్తూరు పర్యటనలో మాట్లాడారని ఎమ్మెల్యే తాటిపర్తి పేర్కొన్నారు.
అమరావతిలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ… ‘చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని టీడీపీ నేతలు డబ్బా కొడతారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాదు.. విషం చిమ్మే నాయకుడు అన్నట్లుగా చిత్తూరు పర్యటనలో మాట్లాడారు. ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకొని బాబు రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తారా?. నేను రాజకీయాలు మాత్రమే చేస్తా.. సుపరిపాలన కాదు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. హోంమంత్రి మేము అనుకుంటే వైసీపీ నేతలు రోడ్ల మీద తిరగలేరు అన్నట్లుగా మాట్లాడుతారు. రాగ ద్వేషాలతో సీఎం, హోంమంత్రి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేవలం టీడీపీ నేతల కోసం పనిచేస్తారా? లేక ప్రజలందరి కోసం పనిచేస్తారా?’ అని ప్రశ్నించారు
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
‘తన కొడుకును సీఎం చేసుకోవటానికి నారా లోకేష్ నియోజకవర్గానికి సీఎం నిధులు మళ్లిస్తున్నారు. ప్రశ్నించిన వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. గత వైసీపీ హయంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ వైస్ జగన్ పథకాలు అందించారు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే రాజీనామా చేయాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై గవర్నర్ స్పందించాలి. వెలిగొండ ప్రాజెక్టుపై నిజాలు మాట్లాడే దమ్ము మీకుందా?. మంత్రి నిమ్మల వెలిగొండ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కు నిధులు కేటాయింపులు చేయకుండా మాటలతో సరిపెడుతున్నారు. వెలిగొండ కోసం త్వరలో పాదయాత్ర చేస్తా’ అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!