Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ అనిశ్చితికి తెర
- హైబ్రిడ్ మోడల్లో ఛాంపియన్స్ ట్రోఫీ
- 2027వరకు తటస్థ వేదికలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది.
‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు తలపడే మ్యాచ్లు తటస్థ వేదికలో జరుగుతాయి. ఆతిథ్య దేశం తటస్థ వేదికను ఎంపిక చేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ అవుతుంది’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లకు యూఏఈ వేదికగా నిలవనుందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. భారత్లో వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియాతో పాకిస్తాన్ ఆడే మ్యాచ్కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న 2026 టీ20 ప్రపంచకప్లో టీమిండియాతో పాక్ ఆడే మ్యాచ్ లంకలో జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read
పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న 2028 మహిళల టీ20 ప్రపంచకప్లో కూడా ఇదే పద్ధతిని అవలంబించే అవకాశం ఉన్నా.. ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కావాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్లో మ్యాచ్లను ఆడేందుకు భారత్ నిరాకరించడంతో అనిశ్చితి నెలకొంది. ఐసీసీ చర్చల అనంతరం పీసీబీ హైబ్రిడ్ మోడల్కు ఒప్పుకుని.. తాము కూడా ఐసీసీ మ్యాచ్లను భారత్లో ఆడమని కండిషన్ పెట్టింది. బీసీసీఐ, పీసీబీలతో చర్చల అనంతరం ట్రోఫీ అనిశ్చితికి ఐసీసీ తెరదించింది. త్వరలోనే షెడ్యూల్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!