Champions Trophy 2025: బీసీసీఐని ఒప్పించండి.. ఐసీసీని వేడుకుంటున్న పీసీబీ!
- పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ
- ఫిబ్రవరి 19 నుంచి మెగా టోర్నీ
- ఐసీసీ ముందుజాగ్రత్త చర్యలు
ICC To Give Extra Money To PCB For Champions Trophy 2025: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. 8 దేశాలు పాల్గొనే ఈ మెగా టోర్నీ 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అందించింది. అయితే ఈ టోర్నీలో ఆడుతుందా? లేదా? అనే దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్కు పంపాలని బీసీసీఐని ఒప్పించే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించిందట. భారత జట్టును పాకిస్థాన్లో ఆడించాలని విశ్వప్రయత్నాలు చేస్తోందట.
భద్రతా, రవాణాపరమైన కారణాల దృష్ట్యా లాహోర్లోని గడాఫీ స్టేడియంలో భారత్ తన మ్యాచ్లు ఆడేలా పీసీబీ షెడ్యూల్ రూపొందించింది. అయినా కూడా పాకిస్థాన్కు వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. భారత్ ఆడే మ్యాచ్లను ఆసియా కప్ మాదిరి వేరే దేశంలో నిర్వహించాలని బీసీసీఐ కోరుతున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా శ్రీలంకల్లో భారత్ మ్యాచ్లను నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ వర్గాలు అడిగాయట. బీసీసీఐ విన్నపంపై ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. బీసీసీఐ కాదు.. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తేనే టీమిండియా పాకిస్థాన్కు వెళుతుందన్న విషయం తెలిసిందే.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
Also Read: Gold Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి
తాజాగా కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన బడ్జెట్, షెడ్యూల్ను ఐసీసీకి సమర్పించినట్లు పీసీబీ వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ను ఫైనలైజ్ చేయడం ఇప్పుడు ఐసీసీ చేతిలోనే ఉంది. ఒకవేళ టోర్నీని హైబ్రిడ్ విధానంలో వేరే దేశంలో నిర్వహించాల్సి వస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐసీసీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. భారత జట్టు మ్యాచ్లు వేరే దేశంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడితే.. అందుకు అవసరమైన నిధులను పీసీబీకి కేటాయించేందుకు సిద్ధంగా ఉందట.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!