Gold Price Today: బడ్జెట్ ఎఫెక్ట్.. ఒక్కరోజులోనే రూ.2750 తగ్గిన బంగారం! భారీగా పడిపోయిన వెండి
- బడ్జెట్ 2024 ఎఫెక్ట్
- ఒక్కరోజులోనే 2750 తగ్గింది
- రూ.92 వేలకు చేరిన కిలో వెండి
Gold Price Today in Hyderabad on 24 July 2024: బంగారం కొనుగోలు దారులకు ‘గోల్డెన్’ న్యూస్. గత ఆరు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు ఊహించని రీతిలో తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2750 తగ్గింది. దాంతో బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా నమోదైంది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 2990 పతనమై.. రూ.70,860కి దిగొచ్చింది. ఒక్కరోజులోనే పసిడి ధరలు ఇంతలా పతనమవడానికి కారణం కేంద్ర బడ్జెట్.
బంగారం, వెండి వంటి వాటిపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్ 2024లో తెలిపారు. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఇటీవలి కాలంలో ఒక్కరోజులో ఇంత మొత్తం ఎప్పుడూ పడిపోలేదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు నేడు స్థిరంగానే ఉన్నా.. సుంకం తగ్గడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. గత 6 రోజుల్లో తులం బంగారం ధర రూ.3,800 పతనమైంది. 22 క్యారెట్స్ పసిడి ధరపై 150, 450, 350, 0, 100, 2750 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై వరుసగా 160, 490, 380, 0, 120, 2990 తగ్గింది. అంటే ఈ 6 రోజుల్లో రూ. 4,140 తగ్గింది.
Also Read
- Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
- Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ. 2750 తగ్గి.. తులం రూ.64,950కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.2990 తగ్గి.. రూ.70,860గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 2750 తగ్గి.. రూ. 65,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల ధర రూ.71,010 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా నమోదైంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర 64,950గా.. 24 క్యారెట్ల ధర రూ.70,860గా ఉంది.
Also Read: KTR Birthday: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్!
మరోవైపు వెండి ధరలు ఇటీవలి రోజుల్లో పడిపోతూనే ఉన్నాయి. దానికి తోడు సుంకం కూడా తగ్గడంతో కిలో వెండిపై రూ.4000 పడిపోయింది. నేడు కిలో వెండిపై రూ.500 తగ్గి.. 87,500గా నమోదైంది. హైదరాబాద్ నగరంలో నేడు కిలో వెండి రూ.92,000కు చేరింది. విజయవాడ, విశాఖలో కూడా రూ.92,000గా నమోదైంది.
తాజావార్తలు
-
Pickleball Players’ Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
-
Iran: ఇరాన్లో ఘోరం.. ఆయుధ మిషన్ పేలి 14 మంది సైనికులు మృతి
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!