ED: కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్ను సవాలు చేస్తూ..హైకోర్టును చేసి ఈడీ..కొద్ది సేపట్లో విచారణ
- కోర్టులో కొనసాగుతున్న విచారణ
- మరి కొద్ది సేపట్లో బెయిల్ మంజూరుపై తీర్పు
- కేజ్రివాల్ బయటకు వస్తే దర్యాప్తును ప్రభావితం చేయొచ్చని కోర్టుకు తెలిపిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది. ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. దిగువ కోర్టులో వాదించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదన్నారు. వ్రాతపూర్వక సమర్పణలకు సమయం ఇవ్వకపోవడం ఏమాత్రం సరికాదని పేర్కొన్నారు. కేసు చాలా తమకే ఫేవర్ గా ఉందని న్యాయవాది ఏఎస్జీ రాజు తెలిపారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి వంటి ముఖ్యమైన పదవిని కలిగి ఉన్నందున దర్యాప్తు జరిపే క్రమంలో బెయిల్ మంజూరు చేస్తే.. దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. ఈరోజు తెల్లవారుజామున, ED తరపు న్యాయవాది హైకోర్టు నుంచి ముందస్తు విచారణను డిమాండ్ చేశారు. ఈడీ తరఫున ఏఎస్జీ రాజు, న్యాయవాది జోబ్ హుస్సేన్ హైకోర్టుకు హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వీ హాజరయ్యారు. ED న్యాయవాదుల బృందం కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకుంది.
READ MORE: CM Chandra babu: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు భావోద్వేగం(వీడియో)
Also Read
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొందిన మొదటి నిందితుడు కేజ్రీవాల్.
మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ మొదటి నిందితుడని తెలసిందే. అతడిని ఈడీ అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్టు చేయలేదు. ఇప్పుడు సీబీఐ తన ఎత్తుగడ వేసే అవకాశం ఉంది. అయితే, ఈ కేసులో ఇతర నిందితులు కూడా ఈడీ కేసులో దిగువ కోర్టు నుంచి సాధారణ బెయిల్ పొందలేదు. మరోవైపు, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రూస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. బెయిల్ మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!