Delhi: కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న మాట కులగణన. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే విపక్ష పార్టీలు కూడా కులగణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే మనుషులనే కాదు.. పశువులను కూడా లెక్కించేందుకు కేంద్రం సిద్ధపడింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల మాదిరిగానే ఈ పశుగణన చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ పశుగణనను సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొబైల్ టెక్నాలజీ వినియోగంతో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
గురువారం పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో మంత్రిత్వ శాఖ సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read
- Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
- TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- 9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేపట్టనున్నారు. పలు జాతులకు చెందిన పెంపుడు జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులు వయసు, లింగం తదితర వివరాలను సేకరించి డిజిటలైజేషన్ చేస్తారు. దేశంలో మొత్తం పశుసంపదపై గణాంకాలు సేకరించడం ద్వారా పశుసంవర్ధక శాఖలో పలు కార్యక్రమాల అమలుకు విధాన రూపకల్పనలో ఇది దోహదపడనుంది.
తాజావార్తలు
-
Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
-
Balayya : బ్రో ఐ డోంట్ కేర్.. సర్జరీ జరిగినా షూటింగ్కు వస్తానంటున్న నట’సింహం’
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలో సందడే సందడి… ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ నుంచి ‘జన నాయగన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’ వరకు!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
ట్రెండింగ్
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!