CCTVs: పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు తప్పనిసరి.. ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Install CCTVs In Police Stations: పోలీసు స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను నెల రోజుల్లోగా పాటించాలని సూచించింది. న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 29 వరకు తమ సమ్మతి అఫిడవిట్లను దాఖలు చేయాలని ప్రభుత్వాలను కోరింది. అయితే పాటించని పక్షంలో సంబంధిత అధికారులపై అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. ఆదేశాలు పాటించకపోతే కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హోం కార్యదర్శులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్లతో కూడిన ధర్మాసనం మంగళవారం పేర్కొంది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా దర్యాప్తు సంస్థల కార్యాలయాలలో సీసీటీవి కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను అమర్చాలని 2020లో న్యాయస్థానం నిర్దేశించింది. ఈ విషయంలో అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంకా సమ్మతి నివేదికలను దాఖలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం. వచ్చే నెలాఖరులోగా ఇక్కడి సీబీఐ ప్రధాన కార్యాలయంతో పాటు బ్రాంచ్ కార్యాలయాల్లోనూ సీసీటీవీలను ఏర్పాటు చేస్తామని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అన్ని కార్యాలయాలు ఇప్పటికే నిబంధనలను పాటించాయని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఎన్ఐఏ కార్యాలయాల్లో స్థాపనల కోసం సీసీటీవీల సేకరణకు ఆమోదం లభించిందని, ఈ ఏడాది చివరి నాటికి కసరత్తు ముగుస్తుందని కూడా తెలిపింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మిగిలిన కార్యాలయాల్లో సీసీటీవీల ఏర్పాటుకు మే వరకు సమయం కావాలని కోరింది. ఢిల్లీలోని పోలీస్ స్టేషన్ల విషయానికొస్తే, మరో 2,000 సీసీటీవీల అవసరం ఉందని, ప్రస్తుతం 1,941 సీసీటీవీలను అప్గ్రేడ్ చేయాల్సి ఉందని కేంద్రం తెలిపింది.
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
Read Also: Land Official Jobs: 6వేల పట్వారీ జాబ్లకు 12లక్షల అప్లికేషన్లు.. డాక్టరేట్ హోల్డర్లతో సహా..
డిసెంబర్ 2020లో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం, కస్టడీ టార్చర్కు సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, రికార్డింగ్ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి పోలీసు స్టేషన్లో, అన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్లు, ప్రధాన ద్వారం, లాకప్లు, కారిడార్లు, లాబీ, రిసెప్షన్తో పాటు లాక్-అప్ రూమ్ల వెలుపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?