Deepfakes: డీప్ఫేక్లపై కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్రం.. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Centre issues advisory to social media platforms on deepfakes, warns of legal consequences: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంగళవారం సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు డీప్ఫేక్ల సమస్యను పరిష్కరించడానికి ఇప్పటికే ఉన్న ఐటీ నిబంధనలను అనుసరించాలని ఆదేశిస్తూ ఒక అడ్వయిజరీ జారీ చేసింది. ఈ అడ్వయిజరీ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు తమ వినియోగదారులకు ఐటీ నిబంధనల ప్రకారం పేర్కొన్న నిషేధిత కంటెంట్ గురించి తెలియజేయడం తప్పనిసరి. ఐటీ నిబంధనలలోని రూల్ 3(1)(b) శారీరక గోప్యత, “అశ్లీల లేదా అశ్లీల” కంటెంట్తో సహా ఇతరుల హక్కులను ఉల్లంఘించే కంటెంట్ను భాగస్వామ్యం చేయడంపై నిషేధాలను వివరిస్తుంది. ఇతర నిషేధించబడిన కంటెంట్లో ఉద్దేశపూర్వకంగా వాస్తవంగా చూపడం ద్వారా వినియోగదారుని మోసగించే లేదా తప్పుదారి పట్టించేవి, మరొక వ్యక్తి వలె నటించే కంటెంట్ ఉన్నాయి.
Read Also: Blast near Israel Embassy: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు తప్పనిసరిగా దాని సేవా నిబంధనలు, వినియోగదారు ఒప్పందాల ద్వారా రూల్ 3(1)(బి) కింద జాబితా చేయబడిన నిషేధిత కంటెంట్ గురించి వినియోగదారులకు తెలియజేయాలని కేంద్రం తెలిపింది. ఇంకా సోషల్ మీడయా ప్లాట్ఫారమ్ను ఉపయోగించడానికి రిజిస్ట్రేషన్ సమయంలో వినియోగదారుకు అటువంటి నిషేధిత కంటెంట్ గురించి కూడా తెలియజేయాలి. వినియోగదారులు ప్లాట్ఫారమ్లోకి లాగిన్ అయినప్పుడల్లా, వారు దానిపై సమాచారాన్ని అప్లోడ్ చేసినప్పుడు లేదా పంచుకున్నప్పుడు వారికి రెగ్యులర్ రిమైండర్లను కూడా పంపాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ఐటీ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాల గురించి వినియోగదారులకు తెలియజేయడం కూడా తప్పనిసరి.
నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ డీప్ఫేక్ల ముప్పు గురించి ధ్వజమెత్తినప్పటి నుంచి, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు తమ ప్లాట్ఫారమ్ల నుంచి అటువంటి కంటెంట్ను వెంటనే తొలగించడంలో తగిన శ్రద్ధ వహించాలని కోరినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ నిబంధనల ప్రకారం ఏదైనా ఉల్లంఘనలకు సంబంధించిన చట్టపరమైన పరిణామాల గురించి ప్లాట్ఫారమ్లకు సరిగ్గా తెలియజేయడం జరిగిందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..