Chandigarh: చండీగఢ్ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు: కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandigarh: చండీగఢ్ను ఆర్టికల్ 240 పరిధిలోకి తీసుకురావడంపై దేశంలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ఈ వివాదాన్ని చల్లార్చడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. చండీగఢ్కు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను సరళీకృతం చేయడాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన ప్రాథమిక దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
READ ALSO: Rajamouli : రాజమౌళి.. డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
ఈ ప్రతిపాదన చండీగఢ్ ప్రస్తుత పరిపాలనా వ్యవస్థను మార్చదని అలాగే పంజాబ్, హర్యానాలతో చండీగఢ్కు ఉన్న సాంప్రదాయ సంబంధాలను ప్రభావితం చేయదని హోం మంత్రిత్వ శాఖ ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. చండీగఢ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అందరితో సంప్రదించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది. రాబోయే శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై ప్రభుత్వం ఎటువంటి బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని కూడా ఈ ప్రకటనలో హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి చండీగఢ్ను కూడా తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పంజాబ్లోని పార్టీలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పై విధంగా స్పందించింది. చండీగఢ్ను కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే ఆదేశాలు, చట్టాలను నేరుగా చేసే అధికారాలను రాష్ట్రపతికి కల్పించిన రాజ్యాంగ అధికరణం 240 పరిధిలోకి తీసుకురావాలని చూడటాన్ని పంజాబ్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్, అకాలీదళ్ తీవ్రంగా వ్యతిరేకించాయి.
READ ALSO: PM Modi – Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో భారత ప్రధాని భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే..
The proposal only to simplify the Central Government’s law-making process for the Union Territory of Chandigarh is still under consideration with the Central Government. No final decision has been taken on this proposal. The proposal in no way seeks to alter Chandigarh’s…
— PIB – Ministry of Home Affairs (@PIBHomeAffairs) November 23, 2025
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!