Himachal Pradesh: వరదలతో హిమాచల్ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himachal Pradesh: వరదలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్కు కేంద్రం రూ.200 కోట్లు మంజూరు చేసింది. హిమాచల్ప్రదేశ్కు ముందస్తు సహాయంగా జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేంద్రం ఆదివారం ఆమోదం తెలిపింది. జూలై 10, 17 తేదీల్లో రెండు విడతలుగా రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి చెందిన కేంద్ర వాటా నుంచి రూ.360.80 కోట్ల ముందస్తు విడుదలకు కేంద్రం గతంలో ఆమోదం తెలిపిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి గత బకాయిల్లో రూ.189.27 కోట్లను ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో బాధిత ప్రజలకు సహాయ చర్యలు చేపట్టేందుకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి నుండి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అడ్వాన్స్గా కూ. 200 కోట్లను విడుదల చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని అధికార ప్రతినిధి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షిస్తోందని, పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవసరమైన లాజిస్టిక్స్, ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోందని పేర్కొన్నారు.
Also Read
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
Read Also: Smart Phones : మొబైల్ పౌచ్ లో ఇలాంటి పెడితే ఇక అంతే.. ఫోన్ పేలిపోవడం ఖాయం..
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు చెందిన 20 బృందాలు, ఇండియన్ ఆర్మీకి చెందిన తొమ్మిది కాలమ్లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన మూడు హెలికాప్టర్లు హిమాచల్ ప్రదేశ్లో రెస్క్యూ, రిలీఫ్ కోసం మోహరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుండి మెమోరాండం కోసం ఎదురుచూడకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితి, సహాయక చర్యలపై అక్కడికక్కడే అంచనా వేయడానికి అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను కూడా నియమించిందని ప్రతినిధి తెలిపారు. జూలై 19 నుంచి 21 వరకు రాష్ట్రంలోని ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.
హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుల కారణంగా కనీసం 330 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 12 జిల్లాలు ఈ రుతుపవనాల కారణంగా వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, మేఘావృతాల కారణంగా దెబ్బతిన్నాయి. గత వారంలో రాష్ట్రంలో 25 కొండచరియలు విరిగిపడటం, ఒక క్లౌడ్బర్స్ట్ సంభవించినట్లు డేటా తెలిపింది.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!