Chirag Paswan: యూనిఫాం సివిల్ కోడ్ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..మద్దతు ఇవ్వను..!
- దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
- ‘యూనిఫాం సివిల్ కోడ్ పై ఎన్డీఏలో ఇప్పటివరకు చర్చ జరగలేదన్న మంత్రి
- యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చిరాగ్
- భారత్ భిన్నత్వం కలిగిన దేశమని అందరినీ ఒకే గొడుగు కిందికి ఎలా తీసుకొస్తారని ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి, ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో ‘విభజన’ ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’, ‘యూనిఫాం సివిల్ కోడ్’పై అధికార ఎన్డీఏలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే..ఈ రెండు అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో భాగమే.
Also Read
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ఓ వార్తా సంస్థతో ప్రత్యేక సంభాషణలో యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముసాయిదాను తన ముందు ఉంచనంత వరకు తాను ఎలాంటి స్టాండ్ తీసుకోలేనని ఆయన తెలిపారు. అయితే.. తన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’కు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి మద్దతిస్తారా అని పాశ్వాన్ను అడిగినప్పుడు? అందుకే ఆయన స్పందిస్తూ.. “మా దగ్గర ఇంకా ముసాయిదా లేదు. ఆ ముసాయిదా చూసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. ఇప్పటికే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.” అని సమాధానమిచ్చారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం
ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూ.. “భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. అది భాష, సంస్కృతి లేదా జీవనశైలి కావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. అందరినీ ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకురాగలరు. అయితే..యూసీసీ అమలు చేస్తే.. ముస్లింలకే నష్టం అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది హిందువులపై కూడా దీని ప్రభావం పడవచ్చు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన విషయాలు, పలు ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్లో గిరిజనులను ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకువస్తారు? కాబట్టి డ్రాఫ్ట్ వచ్చే వరకు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Ameerpet Fire Accident : అగ్ని సెగలతో మెట్రో పిల్లర్కు క్రాక్.. రంగంలోకి జేఎన్టీయూ నిపుణులు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!