Amit Shah: ఏపీ ప్రభుత్వంపై అమిత్షా తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృధ్ధిపై విశాఖ రైల్వే గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 12లక్షల కోట్లు అవినీతి జరిగిందన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుపోయిందని విమర్శలు గుప్పించారు అమిత్షా. దేశ అంతరంగిక భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మన దేశ సరిహద్దులు తాకే ప్రయత్నాన్ని కూడా శత్రు దేశాలు చేయకుండా కట్టడి చేయగలిగామన్నారు. ప్రపంచ దేశాలు మోడీ జపం చేస్తున్నాయని.. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి కాదని ఆంధ్రప్రదేశ్తో పాటు 131 కోట్ల మందికి దక్కుతున్న గౌరవమన్నారు.
రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది… అది చూసి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుని ప్రజలను మభ్య పెడుతున్నారన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్షా. పేదలకు కేంద్రం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యంపై ముఖ్యమంత్రి తన బొమ్మ వేసుకుంటున్నారన్నారు. విశాఖలో భూ మాఫియా,అక్రమ మైనింగ్, ఫార్మా కంపెనీలలో తప్పులు జరుగుతున్నాయని మండిపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు 2 లక్షల30వేల కోట్లు ఏపీకి వస్తే ఆ డబ్బు అంతా ఎక్కడికిపోయిందని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో నిధులు అవినీతికి గురయ్యాయని ఆరోపించారు.
Also Read
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
Read Also: Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?
450కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ అభివృద్ధి., కడప, కర్నూల్ ఎయిర్ పోర్టులు ప్రారంభించింది మోడీ ప్రభుత్వంలోనే అని ఆయన తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు అనుమతులు లభించాయని.. విశాఖ, అనంతపురంలో మల్టీ పర్పస్ లాజిస్టిక్ పార్క్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడ దగ్గర బల్క్ డ్రగ్ పార్క్కు అనుమతి ఇచ్చామన్నారు. 300సీట్లతో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అమిత్షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి 20పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా బీజేపీ విజయానికి సహకరించమని అమిత్షా అభ్యర్థించారు.
తాజావార్తలు
-
Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!