Yoga Break: సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఇకపై ‘యోగా బ్రేక్’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు ఇక నుంచి యోగా బ్రేక్ తీసుకోవాలని మోడీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తమ బిజీ షెడ్యూల్ కారణంగా యోగా చేయలేని వారు, కార్యాలయాల్లోని తమ కుర్చీల్లో కూర్చొని యోగా చేయొచ్చని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆఫీసుల్లో భోజన విరామం, టీ, టిఫిన్ కోసం బ్రేక్లు ఉండేవి.. కానీ.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం యోగా బ్రేక్ ను కూడా తీసుకురావటంతో ఉద్యోగులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా బ్రేక్ ను తప్పకుండా వాడుకోవాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ జీవోను జారీ చేసింది.
Also Read : Amit Sha Tour: నేడే హైదరాబాద్ కు అమిత్ షా.. దర్శక ధీరుడు రాజమౌళితో భేటీ..!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
పని చేసే ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని పునరుత్తేజం పొందేందుకు వీలుగా ఆఫీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని పేర్కొనింది. నిత్యం ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, ఇంటి వద్ద యోగా చేయలేని ఉరుకుల పరుగుల జీవితం.. ఫలితంగా కొందరు ఉద్యోగులు మానసిక ఇబ్బందులు పడుతుంటారు. వీటి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు, పనివేళల్లో ఒత్తిడి తగ్గించుకొని పునరుత్తేజం పొందేందుకు ఆఫీసుల్లోని కుర్చీలో యోగా చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు కేంద్ర సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించారు.
Also Read : Wednesday Stotra: ఈ స్తోత్రాలు వింటే ఆర్థిక ఇబ్బందులు, శారీరక, మానసికలు దూరమవుతాయి
అయితే, కుర్చీల్లో కూర్చొని ఎలాంటి ఆసనాలు వేయాలనే అనుమానం కొందరు ఉద్యోగులకు రావొచ్చు.. అలాంటి వారికోసం, కార్యాలయాల్లో ఎలాంటి ఆసనాలు వేసేందుకు వీలుందో తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్లను మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. సిబ్బంది శిక్షణ , వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన యూట్యూబ్ లింక్ లో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విదివిధానాలు ఉంటాయని తెలిపింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు సూచించింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. అన్ని ప్రభుత్వ శాఖలు వై-బ్రేక్ గురించి ఉద్యోగుల్లో అవగాహన కల్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో తెలిపింది.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!