Central Govt: వాయు కాలుష్యంపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరడంతో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి లేఖ రాశారు. ఈ సందర్భంగా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వాయు కాలుష్యం యొక్క తీవ్ర సవాలును పరిష్కరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ జారీ చేశారు. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉండటంతో ఇక్కడి ప్రజలు సతమతమవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Also: Shruthi Hasan : బ్లాక్ ఔట్ ఫిట్ లో రెచ్చగొడుతున్న శృతి హాసన్..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తరచుగా పేలవమైన స్థాయి నుండి తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది. ఇక, శీతాకాలంలో ఈ సమస్య మరింత పేరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వాయు కాలుష్యం ద్వంద్వ ముప్పును కలిగిస్తుందని చెప్పారు. వాయు కాలుష్యం యొక్క ఆరోగ్య ప్రభావాలను హైలైట్ చేస్తూ.. ఇది తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలకు దోహదం చేస్తుందని, శ్వాసకోశ, హృదయ, సెరెబ్రోవాస్కులర్ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.
Read Also: House Rent Hike: భారీ పెరిగిన ఇంటి అద్దెలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే ?
తరచుగా అకాల మరణాలకు దారితీస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ చెప్పారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దీర్ఘకాల ఆనారోగ్య సమస్యలతో రోగాలు ఉన్నవారు తగిన జాగ్రత్తుల తీసుకోవాలని పంత్ సూచించారు. వాయు కాలుష్యం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, అడ్వైజరీలో పాఠశాల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త విభాగం ఉంది.. వాయు కాలుష్యానికి వారు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ తెలిపారు.
Read Also: House Rent Hike: భారీ పెరిగిన ఇంటి అద్దెలు.. ఏ నగరంలో ఎంత పెరిగిందంటే ?
విద్యార్థుల ఆరోగ్య వ్యవస్థలను పెంపొందించడంతో పాటు వాయు కాలుష్యం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య పరిణామాల గురించి అవగాహన పెంచాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ సూచించారు. లేఖలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య అధికారులను ఆయన తెలిపారు. వాతావరణ మార్పు, ఆరోగ్యం కోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తగిన ప్రణాళికలను రూపొంచించాలన్నారు. వాయు కాలుష్యంతో సహా వాతావరణ మార్పు, మానవ ఆరోగ్యం కోసం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర-స్థాయి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ చెప్పుకొచ్చారు.
నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ (NPCCHH) ఇప్పటికే రాష్ట్ర-స్థాయి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తుంది. తదుపరి దశలో జిల్లా, నగర-స్థాయి ప్రణాళికలను రూపొందించడంతో పాటు వాయు కాలుష్య-సంబంధిత వ్యాధులపై నిఘా కోసం సెంటినెల్ ఆసుపత్రుల నెట్వర్క్ను విస్తరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సుధాన్ష్ పంత్ ప్రతిపాదించారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..