Windfall Tax: చమురు కంపెనీలకు మరో ఝలక్.. క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Windfall Tax: కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు పెద్ద షాక్ ఇచ్చింది. దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్ఫాల్ పన్నును పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 30 నుండి అంటే శనివారం నుండి అమలులోకి వచ్చాయి. అదే సమయంలో డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో లీటరుకు రూ.5.50 నుంచి రూ.5కి తగ్గింది. ఇది కాకుండా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించి రూ.3.50 నుంచి రూ.2.50కి తగ్గింది. పెట్రోల్ పై ఎలాంటి విండ్ ఫాల్ ట్యాక్స్ విధించబోమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
Read Also:Mercantile Bank Ceo: క్యాబ్ డ్రైవర్ ఖాతాలోకి రూ.9000 కోట్లు.. బ్యాంక్ సీఈవో రాజీనామా
Also Read
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15, 2023న విండ్ఫాల్ ట్యాక్స్ని సమీక్షించింది. ఇందులో ముడిచమురుపై టన్నుకు రూ.6,700 నుంచి రూ.10,000కు విండ్ ఫాల్ ట్యాక్స్ ను ప్రభుత్వం పెంచింది. అదే సమయంలో డీజిల్పై ఎగుమతి సుంకాన్ని రూ.6 నుంచి రూ.5.50కి తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఇంధనంపై పన్నును లీటరుకు రూ.4 నుంచి రూ.3.50కి తగ్గించారు.
Read Also:Rules Ranjan : సెన్సార్ పూర్తి చేసుకున్న రూల్స్ రంజన్..
విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
జూలై 1, 2022న మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, ఎటిఎఫ్పై లీటరుకు రూ.6, డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ.13 చొప్పున ఎగుమతి సుంకాన్ని విధించింది. దేశీయ క్రూడాయిల్ విక్రయాలపై టన్నుకు రూ.23,250 విండ్ ఫాల్ ట్యాక్స్ విధించాలని నిర్ణయించారు. చమురు కంపెనీల లాభాలపై ప్రభుత్వం విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తుందని గుర్తుంచుకోండి. ఈ కారణంగా ఎక్కువ లాభాలను ఆర్జించడానికి, చమురు కంపెనీలు భారతదేశంలో కాకుండా విదేశాలలో చమురును విక్రయించకుండా తప్పించుకుంటాయి. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 15 రోజులకు విండ్ ఫాల్ ట్యాక్స్ ను సమీక్షిస్తుంది.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!