Railway Employees: 12 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Employees: దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రైల్వే ఉద్యోగులకు వారి 78 రోజుల జీతంతో సమానంగా బోనస్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల 11.07 లక్షల మంది జాతీయ రవాణా సంస్థలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. బోనస్ చెల్లింపు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1968.87 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటన చేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022-23 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత లింక్డ్ బోనస్ (PLB)ని అన్ని అర్హతలు కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వేలకు ఆమోదించిందని తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్గా చెల్లించనున్నారు.
Also Read: Cabinet: రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు
Also Read
రైల్వేలోని ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ సిబ్బంది మినహా ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డులు), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ ‘సి’ సిబ్బందికి ఈ నిర్ణయం ప్రయోజనం చేకూరుస్తుంది. బోనస్ చెల్లింపు వల్ల ఖజానాపై రూ.1,968.87 కోట్ల భారం పడుతుందని భావిస్తున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
రైల్వే ఉద్యోగులకు ప్రయోజనాలను కల్పిస్తూ, 11,07,346 మంది రైల్వే ఉద్యోగులకు రూ.1,968.87 కోట్ల పీఎల్బీని చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2022-2023 సంవత్సరంలో రైల్వే పనితీరు చాలా బాగుంది. రికార్డు స్థాయిలో 1,509 మిలియన్ టన్నుల కార్గో లోడ్ అయిందని అధికారిక ప్రకటన తెలిపింది. దీనితో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేలో సుమారు 6.5 బిలియన్ల (650 కోట్లు) ప్రయాణికులు రైలులో ప్రయాణించారు. మూలధన వ్యయం, రైలు కార్యకలాపాలలో సామర్థ్యం, మెరుగైన సాంకేతికత కారణంగా మెరుగైన మౌలిక సదుపాయాలతో రైల్వే రికార్డు పనితీరు అంచనా వేయబడిందని ప్రకటన పేర్కొంది. రైల్వే ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు కృషి చేసేందుకు పీఎల్బీ చెల్లింపు ప్రోత్సాహకంగా పనిచేస్తుందని ఆ ప్రకటన పేర్కొంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..