E vehicle policy: ఈ-వాహనాల విధానానికి కేంద్రం గ్రీన్సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ-వాహనాల విధానానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత్ను ఈ-వాహనాల తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-వాహనాల తయారీ పరిశ్రమలకు కేంద్రం కూడా ప్రోత్సాహకాలు అందజేయనుంది. తక్కువ కస్టమ్స్ డ్యూటీకి పరిమిత సంఖ్యలో కార్ల దిగుమతికి అనుమతి ఇవ్వనుంది.
EVల తయారీకి ప్రధాన కేంద్రంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ-వాహన విధానాన్ని ఆమోదించింది.
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పవర్హౌస్గా భారతదేశ స్థానాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈవీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం.. స్వదేశీ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అత్యాధునిక సాంకేతికతతో EVలు తయారు చేసేందుకు పూనుకుంది.
వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారత్ అనుకూలమైనదిగా కేంద్రం తెలిపింది. అలాగే దేశంలోని ఆటోమోటివ్ ల్యాండ్స్కేప్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉందని ఆ శాఖ పేర్కొంది.
ఎలక్ట్రిక్ వాహనాలతో ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ప్రాముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పర్యావరణంలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకోసమే ఈవీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.
ఈవీల తయారీకి భారత్ గమ్యస్థానంగా మారడంతో పాటు అంతర్జాతీయ ప్రముఖ ఈవీ కంపెనీలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలు కలుగుతుందని కేంద్రం పేర్కొంది. భారత్లోకి ప్రవేశించేందుకు అమెరికా కార్ల తయారీ కంపెనీ టెస్లాకు ఈ పాలసీ ద్వారా మార్గం సుగమం అయినట్లే.
కొత్త ఈవీ పాలసీ ప్రకారం ఏదైనా కంపెనీ కనీసం రూ.4,150 కోట్లు దేశంలో పెట్టుబడిగా పెడితే.. పలు రాయితీలు లభిస్తాయి. ఈ పాలసీ వల్ల భారతీయులకు కొత్త తరహా సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు మేకిన్ ఇండియాకు ఊతం ఇచ్చినట్లవుతుందని వాణిజ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. భారతదేశంలో తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలను ప్రోత్సహించేందుకు కనిష్ట ధర, బీమా మరియు సరుకు రవాణా, వాహనాలపై 15 శాతమే కస్టమ్స్ సుంకం విధించనుంది. ఇక పెట్టుబడి పెట్టే కంపెనీలు తక్కువ కస్టమ్స్ డ్యూటీ రేటుతో EVల పరిమిత దిగుమతులకు అనుమతించనుంది.
తాజావార్తలు
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..