Minimum Wages: కార్మికులకు కనీస వేతనాలను పెంచిన కేంద్ర ప్రభుత్వం..
- పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు.
- కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది.
- సంవత్సరానికి రెండుసార్లు 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minimum Wages: వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్ స్కిల్డ్ వర్కర్లకు రూ.783, సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.868, స్కిల్డ్ వర్కర్లకు రూ.954, హై స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ.1035 లభిస్తాయి. నైపుణ్యం, నివసించే ప్రాంతం ఆధారంగా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్మాణం, లోడింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్, ఇంటి పని, మైనింగ్, వ్యవసాయంతో సహా వివిధ అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. VDA సంవత్సరానికి రెండుసార్లు (ఏప్రిల్ 1 – అక్టోబరు 1) 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా సవరించబడుతుంది.
iPhone 16: పది నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ.. ఎక్కడ ఆర్డర్ చేయాలంటే.?
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
కొత్త సవరణ ప్రకారం, జోన్ “A”లో నిర్మాణ, శుభ్రత వంటి రంగాలలో నైపుణ్యం లేని కార్మికులు ఇప్పుడు రోజుకు రూ.783 సంపాదిస్తారు, ఇది నెలకు రూ.20,358 అవుతుంది. సెమీ స్కిల్డ్ వర్కర్లు ఇప్పుడు రోజుకు రూ.868 కాగా., నెలకు రూ.22,568 పొందుతారు. అయితే నైపుణ్యం కలిగిన, క్లరికల్ కార్మికులు రోజుకు రూ.954 కాగా నెలకు రూ. 24,804 పొందుతారు. అధిక నైపుణ్యం కలిగిన కార్మికులు, వార్డు సిబ్బంది, సాయుధ గార్డులు రోజుకు రూ.1,035 సంపాదిస్తారు. మొత్తంగా నెలకు రూ.26,910 పొందుతారు.
Riya Barde Arrest : మహారాష్ట్రలో బంగ్లాదేశ్ పోర్న్ స్టార్ రియా అరెస్టు.. కారణం ఇదే
ఈ సవరణ ఏప్రిల్లో మునుపటి అప్డేట్ తర్వాత 2024కి రెండవ వేతన సవరణను సూచిస్తుంది. పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచికలో హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రభుత్వం ఏప్రిల్, అక్టోబర్ లలో ద్వైవార్షిక VDAని సవరిస్తుంది. వివిధ రంగాలు, కేటగిరీలు, స్థానాల కోసం నవీకరించబడిన పే రేట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) clc.gov.in వెబ్సైట్లో చూడవచ్చు.
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!