PM Modi: కంగనాపై అనుచిత వ్యాఖ్యలు హిమాచల్కు అవమానకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్ప్రదేశ్కే అవమానకరమని.. వారికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండీ నియోజకవర్గంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే పలువురు నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎన్నికల సంఘం, మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని గుర్తుచేశారు.

Also Read
కంగనాపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్ప్రదేశ్కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండీ అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు. ఇక అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్ప్రదేశ్లోనే ఆమోదించిందని మోడీ తెలిపారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోడీ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కంగనా రనౌత్… ప్రధానికి గులాబీ పువ్వుతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేశారు. ప్రధాని మోడీ స్టేజ్ మీదకు రాగానే నమస్కారం చేసి ఎర్ర గులాబీని అందజేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ… మండీకి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక కంగనా రనౌత్ క్రీమ్ చీరతో హిమాచలీ టోపీని ధరించారు. ఇక ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చినట్లు కంగనా ఫొటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్పై ఓ అభిమాని చాలా అద్భుతం అని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. మండీ నియోజకవర్గానికి కూడా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!