PM Modi: కంగనాపై అనుచిత వ్యాఖ్యలు హిమాచల్కు అవమానకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్ప్రదేశ్కే అవమానకరమని.. వారికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండీ నియోజకవర్గంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే పలువురు నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎన్నికల సంఘం, మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని గుర్తుచేశారు.

Also Read
- Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
- Tamannah: ఐటెం అని పిలవద్దట.. తమన్నా డబుల్ స్టాండర్డ్స్ బట్టబయలు
కంగనాపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్ప్రదేశ్కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండీ అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు. ఇక అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్ప్రదేశ్లోనే ఆమోదించిందని మోడీ తెలిపారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోడీ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కంగనా రనౌత్… ప్రధానికి గులాబీ పువ్వుతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేశారు. ప్రధాని మోడీ స్టేజ్ మీదకు రాగానే నమస్కారం చేసి ఎర్ర గులాబీని అందజేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ… మండీకి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక కంగనా రనౌత్ క్రీమ్ చీరతో హిమాచలీ టోపీని ధరించారు. ఇక ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చినట్లు కంగనా ఫొటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్పై ఓ అభిమాని చాలా అద్భుతం అని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. మండీ నియోజకవర్గానికి కూడా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
-
Eng vs NZ: ఇంగ్లండ్కు చుక్కలు చూపించిన న్యూజిలాండ్.. 160 పరుగుల భారీ విజయం, టెస్ట్ సిరీస్ కైవసం.!
-
Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
-
Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
-
India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!