Wheat: గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం..
- గోధుమల స్టాక్ పరిమితిపై కేంద్రం కీలక నిర్ణయం
- ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని గోధుమల నిల్వ పరిమితి విధింపు
- ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు
- కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తింపు
- గోధుమల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు.. ఆహార భద్రత కల్పించేందుకు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమల నిల్వ పరిమితిని విధించింది. ఇప్పుడు టోకు వ్యాపారులు, బహిరంగ విక్రయదారులు లేదా వ్యాపారులు తమ వద్ద 3 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ గోధుమలను ఉంచుకోలేరు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తిస్తుంది. గోధుమల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు.. 2025 వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం హోర్డింగ్ను నిరోధిస్తుందని, దేశీయ మార్కెట్లో గోధుమ లభ్యతను నిర్ధారించడం మరియు ధర స్థిరంగా ఉంచడం తమ లక్ష్యమన్నారు. ఈ క్రమంలో.. లైసెన్సింగ్ అవసరాలు, స్టాక్ పరిమితులు మరియు గోధుమలపై పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2025 మార్చి 31 వరకు అమలులో ఉండనుంది.
Dandruff And Hair Loss : చుండ్రు రావడానికి, జుట్టు రాలడానికి గల కారణాలు ఇవే.. జాగ్రత్త సుమా..
Also Read
కొత్త నిబంధనల ప్రకారం.. రిటైలర్లు చిన్న దుకాణాలకు 10 టన్నుల గోధుమలను ఉంచడానికి అనుమతి ఉందని.. వ్యాపారులు, టోకు వ్యాపారులు మరియు పెద్ద రిటైలర్లు 3,000 టన్నుల పరిమితిని అనుసరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రాసెసర్ల కోసం.. ఈ పరిమితిని 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మిగిలిన నెలలతో వారి నెలవారీ వ్యవస్థాపించిన సామర్థ్యం (MIC)లో 70 శాతం గుణించడం ద్వారా నిర్ణయించబడింది. ఈ రబీ సీజన్లో ప్రభుత్వం 266 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేసిందని.. ఇది అవసరమైన 188 లక్షల మెట్రిక్ టన్నుల కంటే చాలా ఎక్కువ అని అధికారులు తెలిపారు. దేశీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడానికి, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేసినప్పటికీ.. గోధుమలు, చక్కెర, బాస్మతియేతర బియ్యంపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన లేదు.
Renuka Swamy Case: దర్శన్ పేరును లీక్ చేసిన ఆ నలుగురికి కోర్టు స్పెషల్ పర్మిషన్.. ఎందుకంటే?
గోధుమల సేకరణ అంశం గురించి చోప్రా మాట్లాడుతూ.. ఈసారి రికార్డు స్థాయిలో 112 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సేకరించామని చెప్పారు. ప్రయివేటు వ్యాపారులు కూడా చురుగ్గా ఉంటూ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకు గోధుమలను కొనుగోలు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు. మన దగ్గర తగినంత గోధుమ నిల్వలు ఉన్నాయని.. గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. గత కొన్నేళ్లుగా గోధుమ వినియోగం పెరిగిందని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!