ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం గోధుమల నిల్వ పరిమితిని విధించింది. ఇప్పుడు టోకు వ్యాపారులు, బహిరంగ విక్రయదారులు లేదా వ్యాపారులు తమ వద్ద 3 వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ గోధుమలను ఉంచుకోలేరు. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో వర్తిస్తుంది. గోధుమల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు.. 2025 వరకు ధరలను స్థిరంగా ఉంచి ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పండుగల సీజన్లో రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు గోధుమలను బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి గోధుమల ధర చేరింది.