AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Violence: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.. అయితే, ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని.. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈసీఐకు నివేదిక ఇచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు.. పాలనా, పోలీస్ వ్యవస్థల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చారట ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా..
Read Also: Chaya Singh: నటి ఇంట పనిమనిషి ఘాతుకం.. నమ్మించి ఏం చేసిందంటే?
Also Read
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
- రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలను నివారించ లేకపోవడంపై ఈసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. జిల్లా కలెక్టర్లకు సరైన దిశా నిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.. ఇక, పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిపై అభియోగాలు మోపారు.. మరోవైపు.. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస రివ్యూలతో సరిపెడుతున్నారు.. తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా.. ఇక, ఏపీలో హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీష్కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది.. హింసాత్మక ఘటనలు, వాటికి అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతేకాదు.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొంది కేంద్ర ఎన్నికల కమిషన్.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!