Constable Exam Paper Leak: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. విచారణ చేపట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Exam Paper Leak: హిమాచల్ ప్రదేశ్లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది. సీబీఐ నవంబర్ 30న రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, పత్రాల కోసం హిమాచల్ ప్రదేశ్ పోలీసులను కోరిందని, వాటిని ఒకటి లేదా రెండు రోజుల్లో దర్యాప్తు సంస్థకు అందజేసే అవకాశం ఉందని రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. మే 5న లీక్ వెలుగులోకి రావడంతో మరుసటి రోజు పరీక్షను రద్దు చేశారు. మే 7న సిట్ను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మే 18న సీబీఐ విచారణకు సమ్మతి తెలిపింది.
గగ్గల్ (కాంగ్రా), ఆర్కి (సోలన్), భరారీ (సిమ్లా)లోని సీఐడీ పోలీస్ స్టేషన్లలో లీక్కు సంబంధించి రాష్ట్ర పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.1,334 కానిస్టేబుల్ పోస్టులకు 1,87,476 దరఖాస్తులు రాగా, 75,803 మంది అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లలో అర్హత సాధించారు. వీరిలో 26,346 మంది అభ్యర్థులు మార్చి 27న 11 జిల్లాల్లోని 81 కేంద్రాల్లో జరిగిన రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని, ప్రశ్నపత్రాలను లీక్ చేసిన పేపర్ కట్టర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, కింగ్పిన్లు, ఏజెంట్లు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇప్పటివరకు 253 మందిని సిట్ అరెస్టు చేసింది. 150 మంది నిందితులపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో పలు ముఠాలు పాల్గొన్నాయని, సాధారణ నేరస్థులు, ఇంజనీర్లు, రైల్వే, ఆదాయపన్ను శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇందులో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
US-Made Weapon: నక్సల్స్ వద్ద అమెరికా ఆయుధం.. ఆ అత్యాధునిక రైఫిల్స్ను ఎలా సంపాదించారు?
కింగ్పిన్లు తమ ప్రజలను దేశవ్యాప్తంగా ప్రింటింగ్ ప్రెస్లలో నియమించుకున్నారని.. గతంలో అనేక పేపర్లను లీక్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి 80 ప్రశ్నల ఫైనల్ ప్రింట్ లీక్ అయిందని, పేపర్ల ప్రింటింగ్ను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించిన ప్రింటింగ్ కమిటీ సభ్యుడు స్కానర్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు విచారణ కోసం బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేశారు. నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు ప్రధాన సమస్యగా మారింది.
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!