Constable Exam Paper Leak: కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్.. విచారణ చేపట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Exam Paper Leak: హిమాచల్ ప్రదేశ్లో కానిస్టేబుల్ పరీక్ష పేపర్ లీక్పై సీబీఐ విచారణ చేపట్టింది. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ విషయాలు వెలుగులోకి వచ్చిన అనంతరం రాష్ట్ర పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి సీబీఐ కేసును స్వీకరించింది. సీబీఐ నవంబర్ 30న రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేసి, పత్రాల కోసం హిమాచల్ ప్రదేశ్ పోలీసులను కోరిందని, వాటిని ఒకటి లేదా రెండు రోజుల్లో దర్యాప్తు సంస్థకు అందజేసే అవకాశం ఉందని రాష్ట్ర పోలీసు వర్గాలు తెలిపాయి. మే 5న లీక్ వెలుగులోకి రావడంతో మరుసటి రోజు పరీక్షను రద్దు చేశారు. మే 7న సిట్ను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం మే 18న సీబీఐ విచారణకు సమ్మతి తెలిపింది.
గగ్గల్ (కాంగ్రా), ఆర్కి (సోలన్), భరారీ (సిమ్లా)లోని సీఐడీ పోలీస్ స్టేషన్లలో లీక్కు సంబంధించి రాష్ట్ర పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు.1,334 కానిస్టేబుల్ పోస్టులకు 1,87,476 దరఖాస్తులు రాగా, 75,803 మంది అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లలో అర్హత సాధించారు. వీరిలో 26,346 మంది అభ్యర్థులు మార్చి 27న 11 జిల్లాల్లోని 81 కేంద్రాల్లో జరిగిన రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని, ప్రశ్నపత్రాలను లీక్ చేసిన పేపర్ కట్టర్, కోచింగ్ సెంటర్ల యజమానులు, కింగ్పిన్లు, ఏజెంట్లు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇప్పటివరకు 253 మందిని సిట్ అరెస్టు చేసింది. 150 మంది నిందితులపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో పలు ముఠాలు పాల్గొన్నాయని, సాధారణ నేరస్థులు, ఇంజనీర్లు, రైల్వే, ఆదాయపన్ను శాఖల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఇందులో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు.
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
US-Made Weapon: నక్సల్స్ వద్ద అమెరికా ఆయుధం.. ఆ అత్యాధునిక రైఫిల్స్ను ఎలా సంపాదించారు?
కింగ్పిన్లు తమ ప్రజలను దేశవ్యాప్తంగా ప్రింటింగ్ ప్రెస్లలో నియమించుకున్నారని.. గతంలో అనేక పేపర్లను లీక్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ప్రింటింగ్ ప్రెస్ నుంచి 80 ప్రశ్నల ఫైనల్ ప్రింట్ లీక్ అయిందని, పేపర్ల ప్రింటింగ్ను పర్యవేక్షించే బాధ్యతను అప్పగించిన ప్రింటింగ్ కమిటీ సభ్యుడు స్కానర్లో ఉన్నారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు విచారణ కోసం బోర్డ్ ఆఫ్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేశారు. నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు ప్రధాన సమస్యగా మారింది.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!