Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఐదు రోజులు కస్టడీకి సీబీఐ కోరింది. మరోవైపు ఎటువంటి నోటీసులు లేకుండానే తనను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సీబీఐ తెలిపింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు (రూ.15 కోట్లు ఒకసారి, రూ10 కోట్లు ఒకసారి) అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.
Also Read
- Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్'తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
- Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. 'వ్యూహ లక్ష్మి అచ్చు' గురించి తెలుసా.?
- Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
- Kane Williamson: మచ్చలేని మనిషి.. ఓటమిని నవ్వుతో స్వీకరించిన కేన్ మామ గొప్పతనం ఇదే!

‘‘కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో ఆప్ నేతలకు డబ్బు అందించినట్టు చెప్పాడు. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33 శాతం వాటా ఉంది. ఇవన్నీ మేము ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలో పొందుపరిచాం. శరత్ చంద్ర రెడ్డికి డిల్లీలో కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్కి 5 కోట్లు చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అందుకు శరత్ చంద్ర రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారు. హైదరాబాద్లో ఉన్న వ్యాపారాలకు ఇబ్బంది ఉంటుంది అని కవిత బెదిరించారు.’’ అని సీబీఐ తెలిపింది.
కోర్టులో కవిత తన వాదన వినిపించారు. తనను అరెస్ట్ చేస్తున్నారనే విషయం జైలు అధికారులు రాత్రి 10:30కి చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తనకు లీగల్ సలహా కావాలని తాను అడిగానని.. కానీ ఇంతలోనే తనను అరెస్ట్ చేశారని వాపోయారు. కవిత వాదనపై న్యాయస్థానం స్పందిస్తూ.. అరెస్ట్ అప్లికేషన్ ఫైల్ను సీబీఐ తమ ముందు పెట్టిందని.. వారికి తామే అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఇది కోర్టు పరిధిలోని అంశం అని జడ్జి వెల్లడించారు. కోర్టునే ప్రశ్నించొద్దని కవితకు సూచించారు. అలాగే కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐకి కూడా విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. సీబీఐ కూడా ఐదు రోజులు కస్టడీ కోరింది. కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
-
Divorce Drama: ప్రేమ కథగా మారిన విడాకుల ఎపిసోడ్.. భర్తపై కేసులు పెట్టిన భార్యకు కోర్టులో ఊహించని ట్విస్ట్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!