Delhi Liquor Scam: మరోసారి సీబీఐ ముందుకు మనీశ్ సిసోడియా
Delhi Liquor Scam: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు CBI సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ సమన్లలో సీబీఐ పేర్కొంది. ఈ విషయంలో గతంలోనే మనీష్ సిసోడియా స్వయంగా చెప్పారు. గతంలో ఆయన నివాసంలో అధికారులు రైడ్స్ చేశారు. మరి రేపటి విచారణలో మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సిసోడియా ఎలాంటి సమాధానం చెబుతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపటి విచారణ అనంతరం సీబీఐ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో ప్రస్తుతానికి సస్పెన్సే.
కాగా గతేడాది అక్టోబర్ లో కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు సీబీఐ విచారించింది. అంతేకాదు ఆయన నివాసంలో, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అప్పుడు మనీష్ సిసోడియా సీబీఐ విచారణ, లిక్కర్ స్కాంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసును పూర్తిగా నకిలీ, కల్పితంగా ఆయన అభివర్ణించారు. ఇది ఎక్సైజ్ పాలసీ లేదా అవినీతికి సంబంధించిన కేసు కాదని ప్రశ్నించినప్పుడు తనకు అసలు విషయం అర్థమైందని అన్నారు. ఈ కేసు కేవలం ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి తెచ్చారని కూడా సిసోడియా ఆరోపించారు.
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
Read Also: KFC Chicken: KFC సేఫ్ కాదా..? KFC చికెన్ తింటే క్యాన్సర్ వస్తుందా..?
కాగా ఫిబ్రవరి 18న ఆయనకు మొదటిసారి సీబీఐ సమన్లు ఇచ్చింది. 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున తాను సీబీఐ విచారణకు రాలేనని మనీష్ సిసోడియా సీబీఐకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ 26న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు.
Read Also: Bio Asia : ఇకపై ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు
సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయనుంది.. సీఎం కేజ్రీవాల్
సిసోడియా ఢిల్లీ విద్యార్థులకు మెరుగయిన విద్య అందించేందుకు కృషి చేసున్నారు. ఇప్పటికే మనీష్ సిసోడియా నివాసం, బ్యాంకు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి సిబిఐ ఏం పట్టుకోలేదన్నారు. ఆయనకు పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక సిసోడియా అరెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!