ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలో అవినీతి రాకెట్ను సీబీఐ ఛేదించింది. ఆస్పత్రిలో అవినీతికి పాల్పడుతున్న 9 మంది సిబ్బందిని సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. వీరిలో ఇద్దరు వైద్యులతో పాటు సీనియర్ ల్యాబ్ ఇన్చార్జ్ ఉన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగుల నుంచే కాకుండా.. మెడికల్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిని అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: Off The Record: తెలంగాణలో టీడీపీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బడా నేతలు..!
కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పర్వత గౌడతో పాటు కార్డియాలజీ విభాగంలోని ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ రాజ్లను సీబీఐ అరెస్ట్ చేసింది. అలాగే సీనియర్ ల్యాబ్ ఇన్చార్జీ రజనీష్ కుమార్ సైతం అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో సిబ్బంది లంచాలను డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా.. గుండెకు వేసే స్టంట్స్తో పాటు వైద్యానికి అవసరమైన పరికరాలు, గుండెకు వేసే స్టంట్స్లో నిర్దిష్ట బ్రాండులే కావాలని డిమాండ్ చేయడం.. ల్యాబ్స్లో వైద్య పరికరాలు, ఇక ఆస్పత్రిలో చేరిన రోగుల నుంచి లంచాల రూపంలో నగదు వసూలు చేయడం.. అలాగే నకిలీ వైద్య ధృవపత్రాలను జారీ చేస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. అందులో ప్రమేయమున్న 9 మంది సిబ్బందిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది.
ఇది కూడా చదవండి: PM Modi Road Show In Vijayawada: బెజవాడలో ప్రధాని మోడీ రోడ్షో.. చంద్రబాబు, పవన్ కల్యాణ్తో ప్రత్యేక భేటీ..
ఐదు అంశాల్లో అవినీతి జరుగుతోంది.