Amit Shah: రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల1 వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 పార్ అంటూ రాసి ఉందని పేర్కొన్నారు. ఇది ఎలక్షన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
Read also: SSMB29 : మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
మే 1న పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాధవి లత మాట్లాడుతుండగా ఇద్దరు మైనర్ బాలికలు వేదికపైకి వచ్చారు. అమిత్ షా అమ్మాయిలను తన వద్దకు రమ్మని సైగ చేయడంతో అమ్మాయిలు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్లో తామర పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారులు ఆప్ కీ బార్ 400 పార్ అంటూ ప్లకార్డులు కలిగి ఉన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాడు.. దీనిపై స్పందించిన EC జరిగిన సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఆదేశించారు. సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024, సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. A1)యమాన్ సింగ్, A2)హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. A4) రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి A5) MLA రాజసింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!