Amit Shah: రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల1 వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 పార్ అంటూ రాసి ఉందని పేర్కొన్నారు. ఇది ఎలక్షన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
Read also: SSMB29 : మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?
Also Read
- ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్పై భారీ జరిమానా, నిషేధం..
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
మే 1న పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాధవి లత మాట్లాడుతుండగా ఇద్దరు మైనర్ బాలికలు వేదికపైకి వచ్చారు. అమిత్ షా అమ్మాయిలను తన వద్దకు రమ్మని సైగ చేయడంతో అమ్మాయిలు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్లో తామర పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారులు ఆప్ కీ బార్ 400 పార్ అంటూ ప్లకార్డులు కలిగి ఉన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాడు.. దీనిపై స్పందించిన EC జరిగిన సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఆదేశించారు. సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024, సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. A1)యమాన్ సింగ్, A2)హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. A4) రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి A5) MLA రాజసింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
తాజావార్తలు
-
ICC Board Meeting: సంచలన నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు సభ్యత్వం రద్దు..
-
Anantha Sriram : పెద్ది సినిమాలో కధే పెద్ద హీరో !
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్పై భారీ జరిమానా, నిషేధం..
-
Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
-
Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!