IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ
- పుణెలో ట్రైనీ ఐఏఎస్గా ఉన్న పూజా ఖేద్కర్కు కష్టాలు
- పూజపై యూపీఎస్సీ చర్యలు
- అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుణెలో ట్రైనీ ఐఏఎస్గా ఉన్న పూజా ఖేద్కర్కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది. దీంతోపాటు కమిషన్ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చర్యలకు సంబంధించి యూపీఎస్పీ వివరణ ఇచ్చింది. ఖేద్కర్ యొక్క అన్ని సర్టిఫికేట్లు మరియు ఇతర పత్రాలను కోరుతూ యూపీఎస్సీ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
READ MORE: Hero Suman Met Minister: మంత్రి సత్య ప్రసాద్ను మర్యాద పూర్వకంగా కలిసిన హీరో సుమన్
Also Read
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పూజా ఖేద్కర్పై ఎఫ్ఐఆర్పై యూపీఎస్సీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పూజా ఖేద్కర్ 2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజాపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ విచారణ చేపట్టింది. పరీక్షలో ఇచ్చిన సడలింపును తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకున్నట్లు విచారణలో తేలింది. తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేరు, ఫొటో, ఈమెయిల్ ఐడీ, సంతకం, మొబైల్ నంబర్, చిరునామా మార్చుకుని తన గుర్తింపును దాచేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.
READ MORE:Heavy Rains in AP: ఏపీలో కుంభవృష్టి.. పోలవరంలో 27 సెంటీ మీటర్ల వర్షపాతం
షోకాజ్ నోటీసు జారీ..
ఐఏఎస్ పూజా ఖేద్కర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు షోకాజ్ నోటీసు (UPSC షోకాజ్ నోటీసు) కూడా జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు రూపొందించిన నిబంధనల ఆధారంగానే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. CSE 2022లో ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతోంది. భవిష్యత్తులో ఏదైనా పోటీ పరీక్షకు లేదా ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హురాలని ప్రకటించబడింది.
READ MORE:Ponguleti Srinivas Reddy: బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు..
పూజా ఖేద్కర్పై వచ్చిన ఆరోపణలేంటి?
వ్యక్తిగత వాహనంపై మహారాష్ట్ర ప్రభుత్వం అని రాశారు.వ్యక్తిగత వాహనంపై రెడ్లైట్ను అమర్చారు.యూపీఎస్సీలో నకిలీ కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చారు.నకిలీ వికలాంగ సర్టిఫికెట్ ఇచ్చారు.నిబంధనలకు విరుద్ధంగా ఇంటి బయట అక్రమ నిర్మాణం.వయస్సుకు సంబంధించి మోసం ఆరోపణలు.ట్రైనీ అయినప్పటికీ వ్యక్తిగత క్యాబిన్ను డిమాండ్ చేయడం.సీనియర్ అధికారి క్యాబిన్ను బంధించడం.రైతులను పిస్టల్తో బెదిరించారని తల్లి ఆరోపించింది.వివిధ ఆసుపత్రుల్లో వేర్వేరు చిరునామాలు ఇస్తున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..