JP Nadda: దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?
- దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి- ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
- క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా..
- ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది- నడ్డా
- లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా
- ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోంది
- ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి- జేపీ నడ్డా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు.
Stock market: సరికొత్త రికార్డ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
అయితే క్యాన్సర్ కోసం వినియోగించే మందుల ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నదని జేపీ నడ్డా తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు దాదాపు రూ.294 కోట్లు ఆదా అవుతుందన్నారు. 28 కాంబినేషన్లు ఈ జాబితాలో లేవని, అయితే NPPA (నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ) మరియు ప్రభుత్వం వాటి ధరలను కూడా నియంత్రించాయని జేపీ నడ్డా చెప్పారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తుందని చెప్పారు.
Jagga Reddy: హైదరాబాద్కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సభ్యలు అడిగిన ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా ప్రస్తుతం 731కి పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం 72,627కు పెరిగాయని నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!