దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు.
Stock market: సరికొత్త రికార్డ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్
అయితే క్యాన్సర్ కోసం వినియోగించే మందుల ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నదని జేపీ నడ్డా తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు దాదాపు రూ.294 కోట్లు ఆదా అవుతుందన్నారు. 28 కాంబినేషన్లు ఈ జాబితాలో లేవని, అయితే NPPA (నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ) మరియు ప్రభుత్వం వాటి ధరలను కూడా నియంత్రించాయని జేపీ నడ్డా చెప్పారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తుందని చెప్పారు.
Jagga Reddy: హైదరాబాద్కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సభ్యలు అడిగిన ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా ప్రస్తుతం 731కి పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం 72,627కు పెరిగాయని నడ్డా తెలిపారు.