JP Nadda: దేశంలో పెరుగుతున్న క్యాన్సర్ రోగుల సంఖ్య.. కేంద్రమంత్రి ఏమన్నారంటే..?
- దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి- ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా
- క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా..
- ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది- నడ్డా
- లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన జేపీ నడ్డా
- ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోంది
- ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి- జేపీ నడ్డా.
దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. క్యాన్సర్ రోగులకు ధర.. చికిత్స అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగుల సంఖ్య 2.5 శాతం చొప్పున పెరుగుతోందన్నారు. పురుషులలో నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఎక్కువ మంది మహిళలు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారని.. ఏటా 15.5 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని జేపీ నడ్డా తెలిపారు.
Stock market: సరికొత్త రికార్డ్లు సృష్టించిన స్టాక్ మార్కెట్
Also Read
అయితే క్యాన్సర్ కోసం వినియోగించే మందుల ఖరీదును ప్రభుత్వం ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్నదని జేపీ నడ్డా తెలిపారు. ప్రభుత్వం విధించిన ధరల పరిమితి కారణంగా రోగులకు దాదాపు రూ.294 కోట్లు ఆదా అవుతుందన్నారు. 28 కాంబినేషన్లు ఈ జాబితాలో లేవని, అయితే NPPA (నేషనల్ డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ) మరియు ప్రభుత్వం వాటి ధరలను కూడా నియంత్రించాయని జేపీ నడ్డా చెప్పారు. తమ ప్రభుత్వం క్యాన్సర్ మందులను అందుబాటులోకి తీసుకురావడానికి మరింతగా ప్రయత్నిస్తుందని చెప్పారు.
Jagga Reddy: హైదరాబాద్కు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా ఇంత బడ్జెట్ పెట్టారా..?
హెల్త్కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సభ్యలు అడిగిన ప్రశ్నకు నడ్డా స్పందిస్తూ.. ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందని, ఎక్కువ మంది వైద్యులు ఉండేలా మెడికల్ కాలేజీల విస్తరణ జరుగుతోందని జేపీ నడ్డా పేర్కొన్నారు. 2014లో మెడికల్ కాలేజీల సంఖ్య 387 ఉండగా ప్రస్తుతం 731కి పెరిగిందని తెలిపారు. అదే సమయంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51,348 సీట్ల నుంచి 1,12,112 (1.12 లక్షలు)కి పెరిగిందని నడ్డా సభకు తెలియజేశారు. వైద్య విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 2014లో 31,185 ఉండగా ప్రస్తుతం 72,627కు పెరిగాయని నడ్డా తెలిపారు.
తాజావార్తలు
-
Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
-
Samantha-Naga Chaitanya : ఒకే వేడుకలో సమంత – నాగచైతన్య.. అది కూడా పార్ట్నర్స్తో!
-
Karimnagar: రెచ్చిపోయిన దొంగలు.. పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పులు.. భారీగా బంగారం, ఆభరణాలు దోపిడీ
-
Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!
-
Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్ను ‘అన్ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!