Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Campaign Shutdown At 6 Pm In Ap Section 144 Comes Into Effect

AP CEO: సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 144 సెక్షన్ అమలు

NTV Telugu Twitter
Published Date :May 11, 2024 , 5:49 pm
By Rajesh Veeramalla
AP CEO: సాయంత్రం 6 గంటలకు ప్రచారం బంద్.. 144 సెక్షన్ అమలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని అన్నారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందని తెలిపారు.

Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..

సాయంత్రం 6 గంటలకు అన్ని చోట్ల రాజకీయ ప్రచారం ముగిసిపోతుంది.. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. టివి, రేడియో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముగిస్తుందన్నారు. మరోవైపు.. పత్రికల్లో ప్రకటనలు కోసం ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని అన్నారు. కాగా.. రేపు సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని పేర్కొన్నారు. పోలింగ్నకు 90 నిముషాల ముందు మాక్ పోల్ నిర్వహిస్తామని ముఖేష్ కుమార్ చెప్పారు. 13వ తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందని తెలిపారు. ఇప్పటికే.. పోలింగ్ ఏజెంటుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చామన్నారు. నియోజకవర్గంలో స్థానికుడైన వ్యక్తి అభ్యర్థి నుంచి ధ్రువపత్రాల తీసుకుంటే ప్రిసైడింగ్ అధికారి ఏజెంట్గా అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు లేకుండా స్లిప్పులు పంచుకోవచ్చని అన్నారు. పోలింగ్ రోజు ప్రజల రవాణాను నిరోధించాలని ఎన్నికల సంఘం ఉద్దేశ్యం కాదన్నారు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఓటర్లను రాజకీయ పార్టీలు తరలించడం చట్ట వ్యతిరేకం అని తెలిపారు. అభ్యర్థికి సంబంధించి వాహనాల పరిమితి ఉంది.. మూడు వాహనాల వరకే సదరు అభ్యర్థి వినియోగించుకోవచ్చని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదని తెలిపారు. అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమని పేర్కొన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రత కోసం 1,06,145 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు..

Weather news: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పోలింగ్‌కి ఇక్కట్లు తప్పవా?

మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉందన్నారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మరోవైపు.. పోలింగ్ డే రోజున సెలవివ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామని.. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. ఎన్నికల రోజు హింస జరగకుండ చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తామని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని తెలిపారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదని.. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్దులకు మరో క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యిందని.. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP CEO
  • AP Elections 2024
  • Election Campaign
  • Mukesh Kumar Meena
  • Section 144

తాజావార్తలు

  • IPL 2025 Final Live Updates: పంజాబ్ vs ఆర్సీబీ.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లైవ్‌ అప్‌డేట్స్..

  • Rahul Gandhi: ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

  • IPL 2025 Final PBKS: బ్యాటింగ్ ఓకే.. మరి బౌలింగ్ పరిస్థితేంటి..? కొత్త ఛాంపియన్‌గా పంజాబ్ నిలుస్తుందా..?

  • Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోం

  • Bayya Sunny Yadav : భయ్యా సన్నీ యాదవ్‌కి ఉగ్రవాదులతో లింకులు.? బయటపడ్డ కీలక విషయాలు..!

ట్రెండింగ్‌

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • Vivo T4 Ultra: 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో భారత్ లో లాంచ్ కి సిద్దమైన వివో T4 అల్ట్రా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions