Calcutta High Court: నలుగురు ఉగ్రవాదుల మరణశిక్ష రద్దు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Calcutta High Court: దేశంపై యుద్ధం చేసినందుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు పాకిస్తానీ పౌరులతో సహా నలుగురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను కలకత్తా హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నలుగురూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించబడినందున వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మరణశిక్షను కలకత్తా హైకోర్టు జైలుశిక్షగా మార్చింది. జస్టిస్ జైమాల్యా బాగ్చీ, జస్టిస్ అనన్య బందోపాధ్యాయలతో కూడిన ధర్మాసం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మరణశిక్ష నుండి తప్పించుకున్న ఈ ఉగ్రవాదుల పేర్లు షేక్ నయీమ్, షేక్ అబ్దుల్లా అలియాస్ అలీ, మహ్మద్ యూనస్, మహ్మద్ అహ్మద్ రాథర్. ఇందులో షేక్ నయీమ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా.. షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్లు పాకిస్థాన్కు చెందినవారు. మహ్మద్ అహ్మద్ రాథర్ కాశ్మీర్కు చెందిన వాడు.
షేక్ నయీమ్ మరణశిక్షను 10 ఏళ్ల జైలు శిక్షగా మార్చగా, షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్ పాకిస్థాన్, మహ్మద్ అహ్మద్ రాథర్లకు ఐదేళ్ల జైలు శిక్షను తగ్గించారు. షేక్ నయీమ్కు రూ. 25 వేల జరిమానా విధించగా.. మిగిలిన ముగ్గురికి కూడా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ ఉగ్రవాదులు జైలులో గడిపిన రోజుల సంఖ్యను శిక్షా కాలం నుండి తగ్గించాలని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ కోణంలో అందరి శిక్షలు పూర్తయ్యాయి. కానీ ఢిల్లీ కోర్టులో షేక్ నయీమ్పై విచారణ జరుగుతున్నందున, అతడు ఇంకా విడుదలయ్యే అవకాశం లేదు. మహ్మద్ అహ్మద్ రాథర్ కూడా త్వరలో విడుదల కావచ్చు.
Also Read
- India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
- UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
Flordelis Dos Santos: భర్తను చంపేందుకు 6సార్లు ప్లాన్.. కట్ చేస్తే..
2007లో బెంగాల్తో బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్ ప్రాంతంలోని ఒక పాడుబడిన ఇంటి నుండి సరిహద్దు భద్రతా దళం నలుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు, భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల మ్యాప్లు స్వాధీనం చేసుకుంది. వారిపై 2012లో బంగాల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని వారు కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. దొరికిన సాక్ష్యాలను బట్టి ఈ నలుగురు ‘సైనికులు’ అని, ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యులు కాదని బెంచ్ పేర్కొంది. వారు అత్యాశతో లేదా ఒత్తిడితో ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని భావించింది. అప్పీలుదారులు సంస్థలో ప్రముఖ వ్యక్తులు కాదని, వారు తీవ్రవాదం వైపు మళ్లే అవకాశం చాలా తక్కువని పరిస్థితులను తగ్గించడం చూపుతుందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
India: చైనా, అమెరికాలకు పోటీగా భారత్.. ఫ్రాన్స్తో కలిసి 6th జనరేషన్ ఫైటర్ జెట్!
-
UP: డేటింగ్ యాప్తో బ్లాక్మెయిల్.. రూ.6 కోట్లు నొక్కేసిన కిలాడీ!
-
India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
-
UPI Charges: UPI ఛార్జీలపై కీలక అప్డేట్.. కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపారులకు గుడ్న్యూస్
-
Jharkhand: జార్ఖండ్లో పేపర్ లీక్ నిరసనలు.. ప్రభుత్వంతో చర్చలు విఫలం
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!