Calcutta High Court: నలుగురు ఉగ్రవాదుల మరణశిక్ష రద్దు.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Calcutta High Court: దేశంపై యుద్ధం చేసినందుకు ఉరిశిక్ష పడిన ఇద్దరు పాకిస్తానీ పౌరులతో సహా నలుగురు లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులను కలకత్తా హైకోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ నలుగురూ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్రకు పాల్పడినట్లు నిర్ధారించబడినందున వారికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల మరణశిక్షను కలకత్తా హైకోర్టు జైలుశిక్షగా మార్చింది. జస్టిస్ జైమాల్యా బాగ్చీ, జస్టిస్ అనన్య బందోపాధ్యాయలతో కూడిన ధర్మాసం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మరణశిక్ష నుండి తప్పించుకున్న ఈ ఉగ్రవాదుల పేర్లు షేక్ నయీమ్, షేక్ అబ్దుల్లా అలియాస్ అలీ, మహ్మద్ యూనస్, మహ్మద్ అహ్మద్ రాథర్. ఇందులో షేక్ నయీమ్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కాగా.. షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్లు పాకిస్థాన్కు చెందినవారు. మహ్మద్ అహ్మద్ రాథర్ కాశ్మీర్కు చెందిన వాడు.
షేక్ నయీమ్ మరణశిక్షను 10 ఏళ్ల జైలు శిక్షగా మార్చగా, షేక్ అబ్దుల్లా, మహ్మద్ యూనస్ పాకిస్థాన్, మహ్మద్ అహ్మద్ రాథర్లకు ఐదేళ్ల జైలు శిక్షను తగ్గించారు. షేక్ నయీమ్కు రూ. 25 వేల జరిమానా విధించగా.. మిగిలిన ముగ్గురికి కూడా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ ఉగ్రవాదులు జైలులో గడిపిన రోజుల సంఖ్యను శిక్షా కాలం నుండి తగ్గించాలని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ కోణంలో అందరి శిక్షలు పూర్తయ్యాయి. కానీ ఢిల్లీ కోర్టులో షేక్ నయీమ్పై విచారణ జరుగుతున్నందున, అతడు ఇంకా విడుదలయ్యే అవకాశం లేదు. మహ్మద్ అహ్మద్ రాథర్ కూడా త్వరలో విడుదల కావచ్చు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
Flordelis Dos Santos: భర్తను చంపేందుకు 6సార్లు ప్లాన్.. కట్ చేస్తే..
2007లో బెంగాల్తో బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్ ప్రాంతంలోని ఒక పాడుబడిన ఇంటి నుండి సరిహద్దు భద్రతా దళం నలుగురిని అరెస్టు చేసింది. వారి నుంచి భారీ సంఖ్యలో పేలుడు పదార్థాలు, భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల మ్యాప్లు స్వాధీనం చేసుకుంది. వారిపై 2012లో బంగాల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ నిర్ణయాన్ని వారు కలకత్తా హైకోర్టులో సవాలు చేశాడు. దీనిపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. దొరికిన సాక్ష్యాలను బట్టి ఈ నలుగురు ‘సైనికులు’ అని, ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యులు కాదని బెంచ్ పేర్కొంది. వారు అత్యాశతో లేదా ఒత్తిడితో ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని భావించింది. అప్పీలుదారులు సంస్థలో ప్రముఖ వ్యక్తులు కాదని, వారు తీవ్రవాదం వైపు మళ్లే అవకాశం చాలా తక్కువని పరిస్థితులను తగ్గించడం చూపుతుందని కోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!